Mosquito: కొందరికే దోమలు ఎక్కువగా కుడుతాయి ఎందుకో తెలుసా?

Mosquito: ప్రతి ఇంట్లో దోమలు ఉండటం సహజమే. దోమలకు మనుషుల రక్తం ఆహారం. కాబట్టి అవి సాయంత్రం అయ్యిందంటే మనపై దాడి చేస్తాయి. ఐతే.. దోమలు కొందరిని మాత్రమే ఎక్కువ కుడుతాయి. కొందరి జోలికి అస్సలు వెళ్లవు. దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రెస్: దోమలకు ఉదయం పూట పెద్దగా కళ్లు కనిపించవు. మధ్యాహ్నం నుంచీ వాటి చూపు మెరుగవుతోంది. సాయంత్రం, రాత్రి అయ్యే కొద్దీ వాటి కళ్లు బాగా కనిపిస్తాయి. ఇంట్లోకి రాగానే అవి డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నవాళ్లకు ఎట్రాక్ట్ అవుతాయి.  నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ దగ్గరకు ముందుగా వెళ్తాయి. ఎందుకంటే ఆ డ్రెస్సులు వేసుకున్న వాళ్లు దోమలకు వెంటనే కనిపించడంతో వాటి పెట్టడం మొదలుపెడతాయి.
బ్లడ్ గ్రూప్:  బ్లడ్ గ్రూప్‌ని బట్టి కూడా దోమలు దాడి చేస్తాయి. O బ్లడ్ గ్రూప్ ఉంటే రెట్టింపు సంఖ్యలో దాడి చేస్తాయి. A, B గ్రూప్ వారిపై ఓ మోతాదు సంఖ్యలో దాడి చేస్తాయి.

గ్యాస్:  మనం ఆక్సిజన్ పీల్చుతూ, కార్బన్ డై ఆక్సైడ్ వదులుతాం కదా. దోమలకు కార్బన్ డై ఆక్సైడ్ అంటే చాలా ఇష్టం. 160 అడుగుల దూరంలో ఉండి కూడా కార్బన్ డై ఆక్సైడ్ వాసనను గుర్తు పట్టి వచ్చి కాటేస్తాయి.
చెమట: మన శరీరం నుంచీ వచ్చే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటివి ఉంటాయి. అవి దోమలకు చాలా ఇష్టం. ఎవరైనా బాగా శ్రమించి, చెమట చిందిస్తే చాలు దోమలు వాలిపోతాయి. అందుకే చెమట పట్టాక వెంటనే స్నానం చేసే దోమలు దరిచేరవు.

చక్కటి చర్మం:మన స్కిన్ చక్కగా ఉండాలి. కురుపులు, గాయాలు ఉండకుండా చూసుకోవాలి. చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకోవాలి. అందువల్ల చర్మంపై సూక్ష్మక్రిముల సంఖ్య తగ్గిపోతుంది. సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉండే చర్మంపై దోమలు ఎక్కువగా వాలతాయి.

ప్రెగ్నెన్సీ: గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తారు. అందువల్ల అలాంటి వాళ్లను దోమలు టార్గెట్ చేస్తాయి. వాళ్లను 21 శాతం అధికంగా కుడతాయి. ఆఫ్రికాలో ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకే ఎక్కువగా మలేరియా సోకుతోందని పరిశోధనల్లో తేలింది.

మద్యం తాగేవాళ్లు: మద్యం తాగేవాళ్లను కూడా దోమలు ఎక్కువగా కుడుతాయి. ఎందుకంటే మద్యం తాగాక వాళ్లకు బాగా చెమట పడుతుంది. చెమట వాసన రాగానే దోమలు వాటి దాడి చేస్తాయని పలు పరిశోధనాల్లో వెల్లడైంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -