Ganta Srinivara Rao: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల విశాఖలో విజన్ విశాఖ అంటూ ఓ సదస్సు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే విజన్ విశాఖ సదస్సుపై ఏపీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గులేదని ఈయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టాల్సినటువంటి విజన్ విశాఖ సదస్సును తీరా మరోసారి ఎన్నికలు వచ్చే ముందు పెట్టడంలో అర్థం ఏంటి అని ఈయన ప్రశ్నించారు. అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సద్దస్సు పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. సిగ్గు ఉంటే మరోసారి విజన్ విశాఖ గురించి ఆలోచించాలని తెలిపారు.
ఇక మీరు ఎన్ని హామీలు ఇచ్చిన విశాఖ ప్రజలకు మీరంటే అసలు ఏమాత్రం పడదని ఈయన తెలిపారు గతంలో మీ అమ్మగారిని విశాఖ ప్రజలు ఓడించారు. ఇక 2019 ఎన్నికలలో వైసిపి పార్టీని విశాఖ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా విశాఖలో టీడీపీ జయకేతనం ఎగరవేసింది ఈ విజయం వచ్చే ఎన్నికలలో గెలుపుకు సంకేతం అని తెలిపారు.
విశాఖలో గెలవడం కోసం మీరు అక్కడ ప్రజలను ఎన్ని భయాందోళనలకు గురిచేసిన ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టిన డబ్బులను విచ్చల విడిగా పంచిన వారు మాత్రం తమ ఓటును సరైన పార్టీకే వేసారని తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో విశాఖకు జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలని ఈయన ప్రశ్నించారు. ఇలా అభివృద్ధి గురించి అడుగుతారని ఈయన హెలికాప్టర్లలో తిరుగుతున్నారు అంటూ మాజీ మంత్రి గంటా సీఎం వ్యవహార శైలిని తప్పుపడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.