AP Volunteers: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ప్రకటించిన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్కూల్ పిల్లలకు, రైతులకు, మహిళలకు, వృద్ధులకు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల పథకాలలో ప్రవేశపెట్టారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలలో చాలా వరకు చక్కగా నెరవేర్చారని చెప్పవచ్చు. ఏపీ ప్రజల కోసం ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజలకు అన్ని రకాల సేవలను ఇంటిదగ్గరకే కలిగించడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా పనులు ఈజీగా గా అయిపోతున్నాయి.
ఇది వరకు రోజులో ఎమ్ఆర్ఓ, వీఆర్ఓ ఆఫీస్ ల చుట్టు తిరిగేవారు. కానీ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్ని పనులు వారి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా పింఛనీదారులకు ఒకటవ తారీకు వచ్చేసరికి గడపగడపకు పింఛన్ ను అందిస్తున్నారు. అలాగే రిజిస్టర్ బియ్యాన్ని కూడా ఇంటి దగ్గరికి వచ్చేలా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఇలా ఉంటే వాలంటరీలకు మొదటి నుంచి చాలా తక్కువ జీతం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కువ పని చేస్తూ తక్కువగానే జీతం అన్న ఆరోపణలు గతంలో మనం చాలానే విన్నాం. ఇది ఇలా ఉంటే తాజాగా వాలంటరీలు సంతోషించే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ 2024 నుంచి వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే అది ఎప్పటీ నుంచి అన్న విషయానికి వచ్చే ఏడాది జగన్ పుట్టినరోజు కానుకగా ఈ హామీని ప్రకటించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.