Hanuman Director: వైరల్ అవుతున్న హనుమాన్ దర్శకుడి సంచలన ట్వీట్!

Hanuman Director: ఈ సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా విడుదల అయ్యి పెద్ద విజయం సాధించింది హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ హీరోగా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇక అదే ఊపుతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించిన సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ లాంటి సినిమాలు బరిలో ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా సినిమాను రిలీజ్ చేశారు.

 

ఈ సినిమా కూడా ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరి సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాకు మౌత్ టాకు కూడా పాజిటివ్ గా ఉండడంతో రోజురోజుకి ఈ సినిమా ఆదరణ మరింత పెరుగుతూనే ఉంది. మొదటి రోజు ఈ సినిమాకు తక్కువ థియేటర్స్ లభించినా ఇప్పుడు ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ పెరిగాయి. 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ త్ టాక్ తో పాటు భారీగా కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా సక్సెస్ ని చూసి ఓర్వలేని కొంతమంది ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్గా పోస్టులు చేయడంతో ఆ పోస్టులపై ప్రశాంత్ వర్మ స్పందించారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఫేక్ అకౌంట్ లతో ఈ విధంగా ట్విట్టర్ లో రకరకాల ట్వీట్స్ చేస్తుండడంతో ప్రశాంత్ వర్మ వాటికీ గట్టిగా కౌంటర్ ఇస్తూ అలాంటి పోస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -