Chiranjeevi: చిరంజీవి లక్కీ సెంటిమెంట్ గా మారారా.. ఆయన వస్తే బొమ్మ బ్లాక్ బస్టరా?

Chiranjeevi: ఈమధ్య తెలుగు సినిమాలకు ప్రి రిలీజ్ ఈవెంట్లలో ఒక ముఖ్య అతిధిని పిలవడం ఆనవాయితీ అయిపోయింది కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి చాలా మటుకు సినిమాలకు ప్రి రిలీజ్ ఫంక్షన్లకు ముఖ్యఅతిథిగా వచ్చేవాడు కానీ ఆ సినిమాలు ప్లాప్ అవుతూ ఉండేవి కనుక చిరంజీవి ముఖ్యఅతిథిగా ఏ ప్రి రిలీజ్ ఈవెంట్ వచ్చినా సరే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఇండస్ట్రీ మొత్తం పాకిపోయింది.

 

అదే సమయంలో బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరైన సినిమాలు అన్ని హిట్లవడంతో చిరంజీవిని ఎవరు పిలిచేవారు కాదు. కట్ చేస్తే ఈమధ్య రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ అందరిని మెచ్చుకున్నారు. సినిమా ఇప్పుడు సంక్రాంతి విన్నర్ గా మారి బ్లాక్ బస్టర్ కలెక్షన్లను అందుకుంటుంది.ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి హీరో తేజ సజ్జ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సినిమా విడుదలైన తర్వాత వాళ్లకి ఎంత పాపులారిటీ వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ చిరంజీవి గారికి ఎంతో థాంక్స్ చెప్పాలనుకున్నాము ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చి మా సినిమాను ప్రమోట్ చేసిన సెలబ్రిటీ ఆయన ఒక్కరే. అందుకే కలవాలనుకున్నాము కానీ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ అంతా సంబరాలకు బెంగళూరు వెళ్లారు.

 

కనుక వాళ్ళ కాంపౌండ్ ఖాళీ అయిపోయింది మళ్లీ నిన్ననే తిరిగి వచ్చారు ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకొని అందరం కలవబోతున్నాము అని హనుమాన్ చిత్ర యూనిట్ చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి లక్కీ హ్యాండ్ తిరిగి వచ్చింది అని సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -