God: కుక్క లేదా శునకాన్ని కాలభైరవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే దేవుడితో సమానం అని అంటుంటారు.. అటువంటి కాలభైరవ స్వామి కటాక్షం ఉంటే కష్టాలన్నీ పోతాయని అంటున్నారు పండితులు. కాలభైరవ స్వామి విశిష్టమైనటువంటి దేవతా మూర్తి అని, కాలభైరవున్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశిష్టమైన ఫలితాలు చేకూరుతాయట. కష్టాలు, బాధలు, ఇంట్లో సమస్యలతో బాధపడే వారు ఈ స్వామిని పూజించడం వల్ల కష్టాలన్నీ దూరమయ్యి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అయితే అసలు కాలభైరవ స్వామిని ఎలా పూజించాలి? ఏ రోజున పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి?అలాగే ఎవరు పూజించాలి? లాంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాలభైరవ స్వామి రూపాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ స్వామి వారు శునకం మీద నాలుగు భుజాలతో త్రిశూలం, కపాలి, అభయ ముద్ర, అగ్నిహోత్రాన్ని పట్టుకుని కూర్చుని ఉంటారు. కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టగలమని ఈ స్వామి అనుగ్రహం లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా కాశీలో అడుగు పెట్టలేమని పండితులు చెబుతుంటారు.
గ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే కాలభైరవ స్వామిని ఆరాధించాలట.
కాలభైరవ స్వామిని శనివారం నాడు ఉదయం 5 నుండి 6 గంటల సమయంలో కాలభైరవ స్వామి ఆలయంలో దీపారాధన చేయాలి. కాలభైరవ స్వామికి చేసే దీపారాదన ఎంతో ప్రత్యేకమైనది. అందుకోసం మీరు ముందుగా బూడిద గుమ్మడి కాయను సగం లోకి కట్ చేసి లోపల కొద్ది భాగాన్ని తొలగించాలి. తరువాత ఇందులో నువ్వుల నూనె పోసి అందులో తోక మిరియాలను వేయాలి. తరువాత ఎర్రటి వస్త్రంతో వత్తిని చేసి నూనెలో ఉంచాలి. ఈ బూడిద గుమ్మడికాయను రాళ్ల ఉప్పు పోసి దానిపై ఉంచాలి. తరువాత దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని కనుక స్వామి వారికి చూపిస్తే ఎటుదవంటి కష్టాలైనా తొలగిపోతాయని, ఎటువంటి సమస్యలైనా పరిష్కరించబడతాయని పండితులు చెబుతున్నారు. 25 నక్షత్రాల వారు, 12 రాశుల వారు ఎవరైనా ఈ దీపారాధన చేయవచ్చని వారు చెబుతున్నారు. అలాగే ఈ స్వామి వారికి అటుకులు, కొబ్బరి, పాలు, పంచదార లేదా బెల్లం వేసి పాయసం చేసి నైవేధ్యంగా పెట్టాలి. ఈ విధంగా కాలభైరవ స్వామికి దీపారాధన చేసి ఆరాధిస్తారో కష్టాలన్ని తొలగి భోగ భాగ్యాలు కలుగుతాయట.