Lokesh: లోకేష్ చంద్ర‌బాబుకే పుట్టి ఉంటే ఆరోపణలు నిజం చేయాలి.. పిన్నెల్లి సంచలన వ్యాఖ్యలు!

Lokesh: టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్సిపి నేతలపై వారి చేసినటువంటి అవినీతిపై పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై లోకేష్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. పిన్నెల్లి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్ అంటూ కామెంట్ చేశారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రానైట్ లారీల నుంచి మామూళ్లు, ప‌క్క రాష్ట్రాల్లో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా పిన్నెల్లి సోద‌రులు రూ.కోట్లు సంపాదించార‌ని ఆరోపణలు చేయడమే కాకుండా పిన్నెల్లి బ్రదర్స్ ను పిల్లి బ్రదర్స్ అంటూ ఈయన కామెంట్ చేయడంతో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఈయన లోకేష్ పై విమర్శలు చేయడమే కాకుండా ఆయనకు చాలెంజ్ చేశారు.

 

ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ లోకేష్ నువ్వు చంద్రబాబు నాయుడుకే కనక పుట్టి ఉంటే నీలో పౌరుషం ఉంటే నువ్వు మగాడివో అయితే నువ్వు చేసినటువంటి ఆరోపణలన్నింటికీ రుజువు చూపించాలని కోరారు. ఈ అవినీతి పనులను నేను చేశానని నిరూపించడం మీ అయ్య వాళ్లే కాలేదు ఇక నువ్వే నిరూపిస్తావు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

 

లోకేష్ పుష్పం కాదని వెర్రి పుష్పమని ఈయన పాదయాత్రలో భాగంగా ఏవేవో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని తొందరలోనే ఈయనని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించాలి అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోకేష్ తన పట్ల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రస్తుతం లోకేష్ గురించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -