Balayya: వీరసింహారెడ్డిలో బాలయ్య చెప్పిన డైలాగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Balayya: తెలుగులో ప్రస్తుతం నందమూరి బాలయ్య సినిమా ‘వీరసింహారెడ్డి’ మేనియా నడుస్తోంది. మాస్ లుక్ లో, ఫ్యాక్షన్ కథతో, అదిరిపోయే డైలాగులతో థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి బాలయ్య బాబు సిద్ధం కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రిస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. బాలయ్య బాబు నేరుగా ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా బాంబు పేల్చాడనే చర్చ సాగుతోంది.

 

నందమూరి బాలయ్య సినిమా అనగానే ముందుగా అందరూ డైలాగుల గురించి ప్రస్తావిస్తారు. బాలయ్య బాబు డైలాగ్ చెప్పే స్టైల్ తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి బరిలో నిలిచిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో కూడా భారీ డైలాగులు ఉన్నాయని.. పొలిటికల్ హీట్ పుట్టించే చాలా డైలాగులు ఉన్నాయనే చర్చ సాగుతోంది.

 

ఇప్పటికీ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే కొన్ని డైలాగులు ఏపీలో హీట్ పుట్టించగా.. సినిమాలో మరో డైలాగ్ కూడా హీట్ పుట్టిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో ఇవాళ థియేటర్లలో విడుదలైన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ ఓ భారీ డైలాగ్ ఉందని, ఏపీలో పరిస్థితిని వివరించేలా ఈ డైలాగ్ ఉందనే చర్చ సాగుతోంది.

 

‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్య బాబు ఓ సందర్భంలో ‘వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు. గౌరవించడం మన విధి’ అని డైలాగ్ చెబుతాడట. దీంతో ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించే ఈ డైలాగ్ పెట్టారనే చర్చసాగుతోంది. తన సినిమాలో గతంలో కూడా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించేలా కొన్ని డైలాగులను పెట్టిన బాలయ్య.. ఈ సినిమాలో మరీ కార్నర్ చేశాడనే టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -