NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. పెళ్లి అనగానే కట్న కానుకల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. పెళ్లప్పటికే జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో టాప్ మీరోగా ఉన్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి స్టార్డమ్ను సంపాదించుకున్నాడు. దీంతో స్టార్ హీరో ఎన్టీఆర్తో పెళ్లి అంటే.. కట్న కానుకలు పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది.
లక్ష్మి ప్రణతి తండ్రి శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అప్పటికే మీడియా రంగంలోకి స్టూడియో ఎన్ ఛానెల్ ద్వారా ప్రవేశించాడు. అలాగే అప్పటికే అనేక వ్యాపారాలు కూడా చేస్తోన్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడిగా ఆయన ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్కు భారీగా కట్న కానుకలు ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరుగుతోంది. 2011 మే 6న ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి ఒక్కటవ్వగా..ఎన్టీఆర్, ప్రణతిల పెళ్లి జరగడానికి కూడా చంద్రబాబు కారణమని అంటుంటారు.
నార్నే శ్రీనివాసరావు, చంద్రబాబుకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు అప్పట్లో ఉండేకి. ఆ కారణంగా ప్రణతితో ఎన్టీఆర్ పెళ్లి జరిగిందని అంటారు. నార్నే శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో ఆయనకు నగర శివారులో వేల ఎకరాలు భూములు ఉన్నాయి. వాటిల్లో రూ.250 కోట్ల విలువ చేసే భూములు ఎన్టీఆర్కు కట్నం కింద ఇచ్చినట్లు టాక్. అలాగే మిగతావి కూడా కలుపుకుని రూ.1200 కోట్ల వరకు కట్న కానుకలు ఇచ్చారట. ఈ పెళ్లిని చంద్రబాబు అప్పట్లో దగ్గరుండి జరిపించారు. లక్ష్మిపార్వతి కూడా ఈ పెళ్లిలో కీలకంగా వ్యహరించారు. ఆమె కూడా దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి జరిపించారు.