Simhadri: సింహాద్రి మూవీలో చేసిన ఈ తప్పు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Simhadri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి రాజమౌళికి ఎంతో మంచి అనుబంధము ఉందని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు రాగా నాలుగు మంచి హిట్ అందుకున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం సింహాద్రి ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతమని చెప్పాలి.ఇక ఎంత గొప్ప సినిమా అయినా కూడా అక్కడక్కడ చిన్నచిన్న మిస్టేక్స్ జరగడం సర్వసాధారణం.

 

అయితే సింహాద్రి సినిమా పాతది అయినప్పటికీ ఈ సినిమాలో ఓ సన్నివేశం గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో రాజమౌళి ఎలా లాజిక్ మిస్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ఈ సన్నివేశాన్ని వైరల్ చేస్తూ రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు. మరి లాజిక్ లేనటువంటి ఆ సన్నివేశం ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ గోల్ఫ్ బాల్ నీ చేతితో పిండి చేసి పడేస్తారు.

 

ఇలా ఎన్టీఆర్ గోల్ఫ్ బాల్ ను చేతితో పిండి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా గోల్ఫ్ బాల్ చాలా గట్టిగా ఉంటుంది దీనిని విరగొట్టడానికి మిషన్ కూడా ఉపయోగిస్తుంటారు అంత గట్టిగా ఉన్నటువంటి ఈ బాల్ ఎన్టీఆర్ చేతితో ఎలా పిండి చేయగలిగారు అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సన్నివేశం ప్రస్తుతం వైరల్ కావడంతో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జక్కన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -