Sushmita: చిరంజీవి కూతురిని హర్ట్ చేసిన న్యూస్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Sushmita: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తూ మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు చిరంజీవి. చిరంజీవికి ఇద్దరు కూతుర్లు ఆ కొడుకు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వారు ఒకరు సుస్మిత, రెండవ అమ్మాయి శ్రీజ, కొడుకు రామ్ చరణ్. ఇప్పటికీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగే కూతురు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

అలా టాలీవుడ్ లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకుంది సుస్మిత. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మిత తనపై వస్తున్న రూమర్ల గురించి తాను ఎంతగానో బాధపడినట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదని చెప్పింది. ఇక్కడ ప్రతిరోజూ ఒక యుద్ధంలా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమపై బోలెడంత ప్రేమతో పాటు పనిని ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలని, అప్పుడు ముందుకు వెళ్లగలమని ఆమె తెలిపారు. కేవలం గ్లామర్ కోసం ఉండాలనుకుంటే మాత్రం చాలా కష్టమంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సుష్మిత.

 

అనంతరం కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభంలో తనపై వచ్చిన నెగిటివిటీ గురించి కూడా సుస్మిత స్పందించింది. సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన వార్తలు చూసి అప్పట్లో తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. వాటిని వింటూ కూర్చుంటే ముందుకెళ్లలేం. కాబట్టి బయట జరుగుతున్న విషయాలు, మాటలు పట్టించుకోకుండా ముందుకుపోతే నెగిటివిటీ గురించి బాధపడం అని తెలిపింది. ఆ తరువాత తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేయడం పై సుస్మిత స్పందిస్తూ.. సైరా సినిమా నుంచి ఆయన సినిమాలకు పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న పాత్ర, ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటాను.స్టైలింగ్ విషయంలో ఆయన కచ్చితంగా ఉంటారు. కాస్ట్యూమ్ విషయంలో ఏ మాత్రం నచ్చకపోయినా నిర్మొహమాటంగా చెప్పేస్తారు అని చెప్పుకొచ్చింది సుస్మిత. ఇంటర్వ్యూలో భాగంగా సుష్మిత చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -