Imandi Ramarao-Roja: రోజా ఒక దొంగ.. నీ స్థాయి ఏంటో తెలుసా.. ఇమంది రామారావు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Imandi Ramarao-Roja: ఈ మధ్యకాలంలో రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల విమర్శలకు గురవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి నేతను అరెయ్, ఒరేయ్ అంటూ మాట్లాడటంతో పలువురి ఆగ్రహానికి గురి అయింది రోజా. ఇదే క్రమంలో ఆమెపై తన ఆవేశాన్ని వెళ్లగక్కాడు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు. రోజా తన స్థాయి మరిచి మాట్లాడుతుంది. ఇంటికి అద్దె కట్టుకోలేని స్టేజి నుంచి కోట్ల రూపాయల ఇల్లులు సంపాదించుకునేసరికి నోరు అదుపులో ఉండటం లేదు.

అసలు ఆమెకి ఏం తెలుసు, నగరి లో చుట్టుపక్కల ఉన్న మట్టిని దొంగలించడం తెలుసు. స్టేజ్ మీద డాన్సులు వేసుకునే తన స్థాయి ఎక్కడ పవన్ కళ్యాణ్ స్థాయి ఎక్కడ. పవన్ కళ్యాణ్ ని అరె ఒరే అని పిలవడానికి ఆమెకి ఏం అర్హత ఉంది? తను ఏమైనా బొడ్డు కోసి పేరు పెట్టిందా అంటూ ఆమెపై నిప్పులు కక్కారు ఇమంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ పదేపదే మాట్లాడుతుంది. ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే తనకెందుకు.

ప్రస్తుతం సమాజంలో సమస్య అది కాదు కదా. అలాగే ఓడిపోయాడు, ఓడిపోయాడు అంటుంది తనకి మాత్రం ఓడిపోయిన చరిత్ర లేదా అయినా తనకి రాజకీయాలు ఏం తెలుసని.. మహా అయితే నోరు వేసుకొని పడిపోవటం తెలుసు. జగన్మోహన్ రెడ్డి కి కావలసింది ఇలాంటి వాళ్లే అంటూ రోజా ని ఏకిపారేశాడు. చంద్రబాబు నాయుడు ని అన్ని మాటలు అంటుంది రోజ. ఒకప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఆమెకి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చారు.

అలాంటి రోజా వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందంటే ఆమె దానికి కచ్చితంగా ప్రతిఫలం అనుభవించి తీరుతుంది. ఆమె అంతలా రెచ్చిపోయి మాట్లాడటానికి ఆమెకి ఉన్న అర్హత ఏమిటి.. వచ్చే ఎన్నికలలో గనక ఆమె ఓడిపోతే నగరి ప్రజలే ఆమెని తరిమి తరిమి కొడతారు అంటూ రోజా పరువు మొత్తం బజారున పెట్టేసాడు ఇమంది. మరి దీనిపై రోజా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -