Ram Charan-Roja: చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు రామ్ చరణ్. రామ్ చరణ్ హీరోగా చిరుత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఎప్పుడు కూడా దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టరు అనే సంగతి మనకు తెలిసిందే.
ఏ విషయం గురించి అయినా ఇతరులది తప్పు అయిన ఆ తప్పుని చెప్పాలన్నా కూడా చరణ్ మొహమాట పడతారు. ఏ విషయం అయినా తనలోనే దాచుకొని ఇబ్బంది పడే మనస్తత్వం ఉన్నటువంటి రామ్ చరణ్ ఒక డైరెక్టర్ తో మాత్రం కాస్త మొండి పట్టుకొని కూర్చున్నారట. డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ కాజల్ నటించిన చిత్రం గోవిందుడు అందరివాడే. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తో రామ్ చరణ్ కాస్త మొండిగా ప్రవర్తించారట.
ఈ సినిమాలో రాంచరణ్ నానమ్మ పాత్రలో నటి జయసుధ నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ముందుగా ఈ పాత్రలో నటి రోజా అని అనుకున్నారట కృష్ణవంశీ. అయితే ఈ విషయం రామ్ చరణ్ కు తెలియక మూడు రోజులపాటు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. మూడు రోజుల తర్వాత ఈ సినిమాలో నానమ్మ పాత్రలో రోజా నటించబోతున్నారన్న వార్త తెలియడంతో రామ్ చరణ్ రోజా నానమ్మగా నటిస్తే నేను నటించనని తెలిపారట.
ఆమె కనుక నటిస్తే ఈ సినిమాలో నుంచి నేను తప్పుకుంటానని రామ్ చరణ్ సినిమా షూటింగుకు రాకపోవడంతో చరణ్ కి సినిమా నుంచి తప్పుకుంటే మరొక హీరోని తీసుకురాలేను అన్న ఉద్దేశంతో కృష్ణవంశీ ఏకంగా రోజాని ఈ సినిమా నుంచి తప్పించి జయసుధను తీసుకువచ్చారట అప్పటివరకు ఇంకా రోజా పై ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించకపోవడంతో పెద్దగా సమస్య ఏర్పడలేదని తెలుస్తుంది.