Chiranjeevi: ఈమధ్య చిరంజీవి సింగిల్ గా సినిమా తీయటం కంటే మల్టీ స్టారర్ సినిమాలే సేఫ్టీ అనుకుంటున్నారో ఏమో వరుసగా మల్టీ సార్ స్టార్ సినిమాలు మీదే దృష్టి పెట్టారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే వాల్తేరు వీరయ్య మంచి హిట్ ని సాధించింది.
ఇప్పుడు చిరంజీవి డి జె టిల్లుగా ఫేమస్ అయిన సిద్దు జొన్నలగడ్డతో మరొక మల్టీస్టారర్ మూవీ కి సిద్ధపడ్డాడు. ఇందులో చిరంజీవి దర్శన త్రిష నటిస్తుండగా సిద్దు పక్కన శ్రీ లీల జంటగా నటిస్తుంది. ప్రసన్నకుమార్ బెజవాడ రాసుకున్న ఈ కథ చిరంజీవికి బాగా నచ్చిందట.
ఇంతకీ విషయం ఏమిటంటే ఇంచుమించు ఇదే కథాంశంగా వెలిగొండ శ్రీనివాస్ ఒక కథని తయారు చేసుకున్నారు .ఒక తండ్రి కొడుకుకి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటే ఆ కొడుకు తండ్రికి పెళ్లి చేయాలి అనుకోవటం అనేది ఇందులోని ప్రధాన అంశం. అయితే ఈ సినిమాని నాగబాబుతో అనుకున్నారట.
కొడుకు పాత్రకి తరుణ్ ని కూడా అనుకున్నారట. కారణాలు తెలియవు ఆ సినిమా ఎందుకో పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.ఇదే కథతో శ్రీకాంత్ హీరోగా మా నాన్నకి పెళ్లి అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో తండ్రి పాత్ర కృష్ణంరాజు పోషించారు. అయితే ఎందుకో ఈ కథ చిరంజీవిని ఎక్కువగా ఆకర్షించిందట.
కొన్ని మార్పులు చేర్పులతో ఈ సినిమా చేయడానికి సిద్ధపడ్డారు. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కథ తెలిసినదే అవ్వడం..
ప్లాప్ హీరోయిన్ త్రిష కి జోడిగా చిరంజీవి నటించడం.. ఇవన్నీ చూస్తున్న చిరంజీవి అభిమానులు కెరియర్ పరంగా రిస్క్ చేస్తున్నారేమో అని ఆందోళన పడుతున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో సినిమా రిలీజ్ అయితేనే గాని ఒక అంచనా కి రాలేం.