NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సోదరుడు తారకరత్న మరణించడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చూసుకుంటూ బాధలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే నందమూరి ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ కి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయట. ఇదే విషయం గురించి చర్చలు నడవగా అదేం లేదు అంటూ నందమూరి కుటుంబం కవరింగ్ ఇస్తూ ఉంటుంది. తాజాగా తారతరత్న పెద్దకర్మ సందర్భంగా ఎన్టీఆర్ ని అవమానించాడు బాలకృష్ణ.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అలాగే సుహాసిని ఒక చోట కూర్చొని ఉండగా ఇంతలో అటుగా వచ్చిన బాలకృష్ణ, అక్కడున్న వేరే వ్యక్తిని పలకించారు
బాలయ్య తమతో మాట్లాడతారేమోనని ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లేచి నిల్చున్నా, కనీసం వారి వైపు కూడా వాళ్ళ వైపు చూడకుండా బాలకృష్ణ వారిని పట్టించుకోలేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ వీడియోని చూసి మండి పడుతున్నారు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉండాల్సింది. కానీ సోదరుడు మరణించడం అలాగే పెద్దకర్మ కార్యక్రమం ఉండడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేక ఆగిపోయాడు.