Vizag: ఏపీ రాజధానిలో ఇంత ఘోరమా.. 20 రోజులు అలా చేయించారంటూ?

Vizag: రాను రాను విశాఖ క్రైమ్ సిటీగా మారిపోతుంది. ఓ స్కూల్ అటెండర్ అదే పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి బాలికపై కన్నీసాడు ఆమెకి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగకుండా వీడియో తీసి మిత్రులకి పంపించాడు. వాళ్లు కూడా ఆ వీడియో చూపించి బెదిరించి ఆ అమ్మాయిని 20 రోజులపాటు వేధించి తమ కామవంచ తీర్చుకున్నారు. ఇదంతా ఎక్కడో యూపీలోనో,మహారాష్ట్రలో కాదు మన వైజాగ్ లోనే జరిగింది.

నేరుగా విషయంలోకి వెళ్తే.. విశాఖలోని 104 ఏరియాకి చెందిన సత్య రావు ఒక స్కూల్లో అటెండర్ గా చేస్తున్నాడు. ఒక నేవి అధికారి కూతురు అదే స్కూల్లో చదువుతూ సత్య రావు ఉండే అపార్ట్మెంట్ లోనే తను కూడా ఉంటుంది. ఆ పాప మీద కన్నేసిన సత్య రావు ఆమెకి మాయమాటలు చెప్పి లో పరుచుకున్నాడు. అంతేకాకుండా వ్యవస్థను చేసి దానిని మొబైల్లో వీడియో తీసి తన మిత్రులకు కూడా పంపించాడు.

 

గత నెల మూడు నుంచి 23 వరకు పలుమార్లు లైంగికంగా బాలికను వేధించి చిత్రహింసలకు గురి చేశారు బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో గమనించిన తల్లిదండ్రులు ఆమెని నిలదీయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సత్య రావు పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్య రావుని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. బాధితురాల్ని విశాఖ కేజీహెచ్ లో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. కేసును దిశా పోలీసు విభాగానికి బదిలీ చేసి విచారణ వేగవంతం చేశారు ఏసీపీ వివేకానంద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు విశాఖలో కలకలం రేపుతుంది. ఏపీ రాజధానిలో ఇంత ఘోరమా అంటూ ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -