Kriti Sanon-Prabhas: టాలీవుడ్ ప్రేక్షకులకు కృతి సనన్ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ మహేష్ బాబు సరసన నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు అంటే ఎవరైనా ఇట్లే గుర్తుపడతారు. తెలుగులో రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడు అంతగా గుర్తింపు సంపాదించలేకపోయింది.
కానీ బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక చాలాకాలం తర్వాత ఈ అమ్మడు.. టాలీవుడ్ హీరో తో జతకట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ఆది పురుష్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
నిజానికి కృతి చాలాకాలం తర్వాత మళ్లీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ప్రభాస్ కృతి సనన్ ప్రేమలో పడినట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. అసలు ఈ పుకార్లు రావడానికి కారణం ఏంటంటే.. ఇటీవలే కాపీ విత్ కరణ్ అనే షో లో కృతి సనన్ పాల్గొంది.
ఆ షోలో ఈ అమ్మడు తనకు ఎదురైన ప్రశ్న కారణంగా ప్రభాస్ కి కాల్ చేసింది. ఇక ప్రభాస్ కూడా ఆమె చేసిన మొదటి రింగ్ కి తన కాల్ ఆన్సర్ చేశాడు. ఈ విషయం గమనించిన నెటిజన్స్ వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారేమో అన్న అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. ఇక కృతి కూడా ప్రభాష్ తో తనకి మంచి ర్యాపో ఉన్నట్లు తనకు కాల్ చేసింది.
దీంతో అనుష్క అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అనుష్క అభిమానులు అనుష్కను ప్రభాస్ తో జతగా చూడాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వార్త తెలియటంతో జీర్నించుకోలేకపోతున్నారు. మరి ఈ గాసిప్స్ తెలుసుకున్న కృతి ఈ పుకార్లకు ఏ విధంగా బ్రేక్ ఇస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ కృతి జంటగా చేస్తున్న ఆది పురుష్ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.