Srinu: విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి కేసు మరొకసారి తెరపైకి వచ్చింది ఈ కేసులో నిందితుడు జన్పల్లి శ్రీనివాస్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2018 అక్టోబర్ 25న అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పై..
శ్రీనివాస్ కోడి కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. అయితే 2019 మే 25న న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేసింది కానీ ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టడంతో కోర్టు శ్రీనివాస్ వేలు రద్దు చేసింది దీంతో అప్పటినుంచి జైల్లోనే జీవితం గడుపుతున్నాడు శ్రీను.
ఈ క్రమంలోనే శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది తాజాగా ఎన్ఐఏ కోర్టులో మరొకసారి వాదనలు వినిపించారు. తనుకు బెయిల్ మంజూరు చేయాలన్న శ్రీనివాస్ అభ్యర్థనను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించమని సూచించింది.
కేసుని జూలై 11 కి వాయిదా వేసింది. ఈ చర్యలతో విసిగిపోయిన శ్రీనివాస్ కేసు విచారణలో జాతీయాన్ని నిరసిస్తూ జైల్లోనే నిరాహార దీక్ష చేపట్టే యోజనలో ఉన్నాడని ఆయన తరుపు లాయర్ అబ్దుల్ సలీం ప్రకటించారు. జూలై 11 నుంచి జైల్లో దీక్ష చేసేందుకు శ్రీను సిద్ధమవుతున్నాడు.
శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడు కోర్టు అతనికి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని అబ్దుల్ సలీం చెప్పుకొచ్చారు. తమ కుమారుడు బయటికి వచ్చేలాగా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలి అంటూ జున్నుపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు సావిత్రి తాతారావు కోరుతున్నారు.
కుటుంబానికి ఆధారమైన కొడుకు జైలు పాలు అవటంతో వృద్ధాప్యంలో నరకం అనుభవిస్తున్నాము అంటూ స్వరూ ఇదివరకే తమ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ విషయంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి