Jagan: జగన్ ప్రతినిధి ఆ పార్టీలో చేరడం వెనుక కారణమిదేనా?

Jagan: ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ లోకి తన ప్రతినిధిని విజయవంతంగా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఆయన మరెవరో కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరుతో కాంట్రాక్టులు నిర్వహించడమే కాదు కడప జిల్లాలోని జగన్ రెడ్డి బంధువులతో వియ్యమందుకున్న నేత శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదీ కూడా తన బలాన్ని ప్రదర్శిస్తూ భారీ సభ ఏర్పాటు చేసి మరీ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఆయనకు పెద్దగా కాంట్రాక్టులు రాలేదు. కానీ ఏపీలో దారి కాచి మరి పన్నులు వసూలు చేసే కాంట్రాక్టులు కూడా ఆయనకే దక్కాయి.

గనుల సీవరేజీని వసూలు చేసే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు ఇచ్చింది ప్రభుత్వం. ఈ కాంట్రాక్టులు కూడా చాలా జిల్లాల్లో ఈ పొంగులేటి కుటుంబ కంపెనీలకే దక్కాయి. ఇక అన్నమయ్య డ్యాం సహా చాలా ప్రాజెక్టులు దక్కిన విషయం తెలిసిందే. కొన్ని వేలకోట్ల బిల్లులు కూడా ఇటీవలే మంజూరు చేశారు. రూ. లక్ష బిల్లు కోసం పార్టీ నేతలు కాళ్లరిగేలా తిరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. అలాంటి పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక వెనుక జగన్ లేకుండా ఉంటారని ఎవరైనా అనుకోగలరా ? పొంగులేటి తన రాజకీయ అడుగులు ప్రతి విషయంలోనూ జగన్ సలహాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత బహిరంగంగానే మూడు సార్లు జగన్ తో భేటీ అయ్యారు.

 

ఎన్ని రహస్య భేటీలు జరిగాయో తెలియదు కానీ, చివరికి చాలా ఆలోచించినట్లుగా షో చేసి చివరికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎలా చూసినా ఇప్పుడు జగన్ రెడ్డి తన మనిషిని కాంగ్రెస్ లోకి పంపగలిగారని వచ్చే ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితి ఏర్పడినా పొంగులేటి ద్వారా పనులు చక్కబెట్టుకుంటారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అంతేకాకుండా పొంగులేటిని కాంగ్రెస్ లోకి జగన్ పంపించడం వెనుక వ్యూహాలు ఏవైనా ఉన్నాయా అన్నా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -