Sukumar house: సుకుమార్ ఇంట్లో చిరు, బాలయ్య ఫోటోలు అందుకే ఉన్నాయా?

Sukumar house: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుకుమార్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈయన చేసినటువంటి ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా బుల్లితెరపై ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్ తన కుటుంబ విషయాల గురించి వెల్లడించారు.

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక అభిమాన హీరో ఉంటారు. అయితే వారి అభిమాన హీరోల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం సర్వసాధారణం. కానీ సుకుమార్ ఇంట్లో చిరంజీవితో పాటు బాలయ్య ఫోటో కూడా ఉందని సుకుమార్ తెలియజేశారు. ఇలా బాలకృష్ణ చిరంజీవి ఫోటోలు తన ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటో కూడా సుకుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరి బాలకృష్ణ చిరంజీవి ఫోటోలు సుకుమార్ ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

 

సుకుమార్ కుటుంబంలో వారు నలుగురు అన్నదమ్ములని తెలిపారు. అయితే పెద్దన్నయ్యకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని అందుకే పెద్దన్నయ్య బాలకృష్ణ ఫోటోని ఇంట్లో పెట్టుకున్నారని తెలిపారు. అలాగే రెండవ అన్నయ్య మూడో అన్నయ్యకి చిరంజీవి అంటే ఎంతో ఇష్టం కావడంతో వారిద్దరూ కూడా చిరంజీవి ఫోటోని మరోవైపు పెట్టుకున్నారని సుకుమార్ తెలిపారు.ఇక ఈ ఇద్దరు హీరోలలో ఎవరి సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించిన మా ఇంట్లో పండగ వాతావరణం ఉండేదని, ఈ సందర్భంగా వారి ఇంట్లో ఉన్న ఫోటోల గురించి సుకుమార్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

ఇలా తమ ఇంట్లోనే ఇద్దరు హీరోల అభిమానులు ఉన్నారని సుకుమార్ తెలియజేశారు. ఇక ఈయన సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -