Kadapa: ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అధునుగా భావించి కడపలో పెద్ద ఎత్తున దందాలు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులంటూ చిన్నచితిక వ్యాపారుల నుంచి భూ దందాల వరకు పెద్ద ఎత్తున ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ భారీగా దండాలు నిర్వహిస్తున్నారు. ఇలా కడప జిల్లా మొత్తం జగన్ బంధువుల పెత్తనం కొనసాగుతుందని చెప్పాలి.
కడపలో రోజురోజుకు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే దుగ్గాయపల్లే బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు అయితే వీరు చెప్పినదే కడపలో శాసనం వీరికి ఎవరైనా ఎదురు తిరిగితే ఇక వారి జీవితానికి అదే ఆఖరి క్షణంగా మారిపోతుంది. కడప జిల్లాలో దుర్గాయ పల్లె బ్రదర్స్ అంటే అక్కడ ప్రజలందరూ భయంతో వణికి పోతున్నారు.
వీరికి పార్టీలతో పనిలేదు వారు అనుకున్నచోట భూములు వారి పేరున సొంతం కావాల్సిందే అనుకున్న పనులు క్షణాలలో జరిగిపోవాల్సిందే. ఇలా కడపలో భూతంధాలను చేయడం కోసం ఈ బ్రదర్స్ ఇందుకోసం ఒకట్రెండు ముఠాలను సైతం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 23న కడప నగరం నడిబొడ్డున వైసీపీ యువ నాయకుడు శ్రీనివాస్రెడ్డి హత్యకు గురికావడంతో వీరి భూతందా వ్యవహారం గురించి కడపలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుల అరాచకాల కారణంగా వైఎస్ఆర్సిపి పార్టీకి కంచ కోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో బీటలు వారే సూచనలు భారీగా కనిపిస్తున్నాయి వచ్చే ఎన్నికలలో కనీసం గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తోంది. అయితే కడుపులో ఇలా పెత్తనం చెలాయిస్తున్నటువంటి దుగ్గాయా పల్లె బ్రదర్స్ ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక సమర్పించకుండా ఏం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ విషయంపై తొందరగా జగన్ మోహన్ రెడ్డి మేల్కొని వారి ఆగడాలకు అడ్డుకట్టు వేయకపోతే వచ్చే ఎన్నికలలో ఆయనకు భారీ ఇబ్బందులు తలెత్తుతాయని తెలుస్తుంది.