YS Jagan: ఉగాది తర్వాత ఏపీ సీఎం జగన్ కు కలిసొచ్చే ఛాన్స్ ఉందా?

YS Jagan: తెలుగు వారు అతి పెద్ద పండుగగా జరుపుకునే వాటిలో ఉగాది ఒకటి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు శోభకృత్ నామ సంవత్సరాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇలా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణం వినడమే కాకుండా ఈ ఏడాది వారి జాతకం ఎలా ఉంటుందనే విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇలా ఉగాది పండుగ సందర్భంగా రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని సినిమా సెలబ్రిటీల వరకు వారి జాతకాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటారో.

ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏడాది ఎలా గడుస్తుంది? ఆయన జాతకం ఎలా ఉంది? అనే విషయానికి వస్తే… జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న జగన్ మోహన్ రెడ్డి జన్మించారు. మిథునరాశిలో చంద్రుడు రాహు నక్షత్రంలో సంచరిస్తుండగా మీనాలగ్నం జగన్ మోహన్ రెడ్డి జన్మించారు. ప్రస్తుతం ఈయన జాతకంలో బుధ మహాదశ నడుస్తోంది. ఇది 2024 అక్టోబర్ 31 వరకు ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఆయనకు మంచి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

 

అక్టోబర్ 31 తరువాత శని ప్రభావం కారణంగా ఆయన కొంత కష్టపడాల్సి ఉంటుంది. 2027 జూలై వరకు కాస్త ఇబ్బందికర పరిస్థితిలో ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆయన కష్టపడితే మంచి ఫలితం ఉంటుందని ఆయన జాతకంలో రాజయోగం ఉందని పండితులు తెలుపుతున్నారు. బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు.

 

జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది దైవ బలాన్ని కనుక అత్యధికంగా సంపాదించుకుంటే ఆయనకు తిరుగులేని విధంగా సమర్థత అనేది ఏపీలో చాటే సంవత్సరంగా ఉంటుందని అన్నారు.మొత్తానికి వచ్చే ఎన్నికలలో కూడా జగన్ విజయభేరి మోగించబోతున్నట్లు పండితులు ఆయన జాతకం ద్వారా తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -