Roja: జగన్ ను మించిన దైవమున్నదా.. రోజా కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Roja: ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజులలో ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా సరికొత్త భజన చేయడం ప్రారంభించారు.తమకు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ ఇస్తారా లేదా అన్న భయం నాయకులలో ఉంది దీంతో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని పొగిడే పనిలో ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి భజన చేయడంతో ఆయన సానుభూతి పొంది వచ్చే ఎన్నికలలో కూడా టికెట్ సాధించాలని ఆరాటపడుతున్నారు.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని పొగడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలోభాగంగా మొదటిసారి నగరి నియోజకవర్గానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి గురించి రోజా పెద్ద ఎత్తున పొగడటమే కాకుండా ఏకంగా జగన్మోహన్ రెడ్డిని దైవ సమానం అంటూ మాట్లాడినటువంటి తీరు అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది.

 

ఇకపోతే రోజా ఇలా పొగడటం ఇది మొదటిసారి కాదు ఈమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని ఇదే స్థాయిలో పొగిడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అదే విధంగా పొగుడుతూ వచ్చే ఎన్నికలలో టికెట్టు కోసం కాక పడుతున్నారనే చెప్పాలి . ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ…

 

మీరు రాముడిని పూజించినా… అల్లా ను ఆరాధించినా, ఏసు ప్రభువును ప్రార్ధించినా… మిమ్మల్ని ఉన్నత విద్యలు చదివించేది మాత్రం ఆ దేవుడు పంపిన జగనన్నే’అనేశారు. అదే వేదిక మీద కూర్చున్న జగన్ ఈ ప్రసంగం వింటూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రోజా జగన్ మోహన్ రెడ్డిని దేవుడు అంటూ పొగడమే కాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -