Lakshmi Pranathi: లక్ష్మీ ప్రణతి అక్కడ షాపింగ్ చేయడం వెనుక అసలు రీజన్ ఇదేనా?

Lakshmi Pranathi: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి అందరికీ తెలిసిందే.తన భర్త ఒక స్టార్ హీరో గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రణతి మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. ఎలాంటి ఆడంబరాలకు పోరు, ఇతర సినిమా కార్యక్రమాలలో కూడా పాల్గొనరు, మీడియా ముందుకు కూడా రారు. అలాగే సోషల్ మీడియాకు కూడా ఈమె చాలా దూరంగా ఉంటారు. ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ తన కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఇలా స్టార్ హీరో భార్యగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీ ప్రణతి తాజాగా చేసినటువంటి ఓ పని తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ఇలా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి సెలబ్రిటీలు షాపింగ్ చేయాలంటే విదేశాలకు వెళ్లి వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మి ప్రణతి మాత్రం అందుకు భిన్నంగా చార్మినార్ వద్ద షాపింగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.ఇలా ఒక స్టార్ హీరో భార్య అయిండు కొని చాలా సింపుల్ గా ఈమె ఛార్మినార్ వద్ద షాపింగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రణతి చార్మినార్ నైట్ బజార్లో ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా ఒంటరిగా సాధారణ ప్రజలలో కలిసి షాపింగ్ చేస్తున్నటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి ఎన్టీఆర్ అభిమానులు వదినమ్మ అంటూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇలా ఈమె చార్మినార్ వద్ద నైట్ బజార్ లో షాపింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం రంజాన్ కావడంతో చార్మినార్ వద్ద ఎన్నో రకాల నగలు ఇతర వస్తువులు పెద్ద ఎత్తున ప్రదర్శించడంతో ఈమె కూడా ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇష్టపడ్డారు.

ఇలా ఎప్పుడు బయటకు రానటువంటి లక్ష్మీ ప్రణతి ఒంటరిగా చార్మినార్ వద్ద సాధారణ జనాల మధ్య షాపింగ్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమె సింప్లిసిటీకి ఫిదా అవుతూ ఉన్నారు. ఇక లక్ష్మీ ప్రణతి సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వేడుకలకు కూడా బయటకురారు. ఆర్ఆర్ఆర్ జపాన్ లో విడుదలవుతున్న నేపథ్యంలోనే ఈమె తన భర్తతో కలిసి జపాన్ లో సందడి చేశారు. ఇక సోషల్ మీడియాకు కూడా లక్ష్మీ ప్రణతి దూరంగా ఉంటారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -