NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్30 మూవీ స్క్రిప్ట్ లో ట్విస్ట్ ఇదేనా?

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ జోనర్‌‌లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో NTR30పై మరింత బజ్ ఏర్పడింది. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా స్టోరీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

 

ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సక్సెస్‌తో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో కొరటాల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

ఎన్టీఆర్30 సినిమా కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో ఒక ఎమోషనల్ రైడ్ గా భారీ స్థాయిలో ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ కథలో మనుషుల కంటే మృగాళ్లు ఎక్కువగా ఉంటారు. భయం అంటే ఏంటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది అంటూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసాడు.

మరీ ఆసక్తికరం ఏంటంటే తారక్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఓవైపు తండ్రిగా మరోవైపు కొడుకుగా ద్విపాత్రాభినయంలో అదరగొట్టబోతున్నాడు. సముద్ర తీర ప్రాంతంలో ఆయుధాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ కథలో, వెపన్స్ స్మగ్లింగ్ ను అరికట్టడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పాత్ర పోరాటం చేస్తుందట. అయితే కొన్ని పరిస్థితుల వల్ల తండ్రి పాత్ర అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుందట. కొడుకు పాత్ర విలన్ గ్యాంగ్ తో కలసి వర్క్ చేయాల్సి వస్తుందట.

 

ఇందులో భైరవ అనే కరడుకట్టిన విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తుండు. శ్రీకాంత్ అతనికి తోడుగా ఉండే పాత్రలో కనిపిస్తాడని బోగట్టా. సినిమాలో కోస్టల్ ఏరియాపై ఆధిపత్యం కోసం ఫైట్ చేసే ప్రాసెస్ లో తారక్, సైఫ్ మధ్య మట్టి కుస్తీ పోటీ కూడా ఉంటుందట. ఇది సినిమాలో హైలైట్ గా నిలుస్తుందట.

 

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ – కొరటాల కాంబోలో రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. నందమూరి ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -