YCP: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రోజురోజుకు ఎంతో దిగజారిపోతుంది చివరికి తమ కడుపు నింపుకోవడం కోసం ఎవరి కాళ్ళు అయినా పట్టుకోవడానికి తాము సిద్దమైన ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పాలి. తాజాగా ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. అధికారికంగా.. . ప్రభుత్వం అధికారిక విషయాల్ని చెప్పే సచివాలయంలోని మీడియా పాయింట్లు కూర్చుని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ త్వరలోనే నంది అవార్డులను ప్రకటించబోతున్నామని తెలిపారు. అయితే నాటక రంగానికి ముందుగా నంది అవార్డులను ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. అదే విధంగా ఏపీలో షూటింగ్స్ గురించి కూడా పోసాని మాట్లాడుతూ ఏపీలో సినిమా షూటింగ్ లు జరుపుకోవాలి అంటే కెసిఆర్ పర్మిషన్ తీసుకోవాలి అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఏపీలో సినిమాలు తీసుకుంటే కేసీఆర్ కక్ష సాధింపులకు పాల్పడతారని పోసాని అభిప్రాయం. అందుకే కాళ్లు పట్టుకుని అయినా బతిమాలుకుంటామని ఆయన అంటున్నారు. ఏపీలో సినిమాలు చిత్రీకరించినా శిక్ష లేకుండా చూస్తానని కాళ్లు పట్టుకుంటానంటున్నారు.ఏపీ నుంచి సినీ పరిశ్రమలు తీసుకొస్తామని ఎంతో పెద్దపెద్ద మాటలు చెప్పినటువంటి ఏపీ సర్కార్ కనీసం సీరియల్స్ షూటింగ్ కూడా ఆకట్టుకోలేకపోయింది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.
ఒకప్పుడు పలు సినిమా షూటింగ్ ల కోసం మేకర్స్ వైజాగ్ వంటి ప్రాంతాలకు వచ్చేవారు అయితే ప్రస్తుతం అక్కడి కాకుండా ఏ ఇతర ప్రాంతాలలో అయినా షూటింగ్ చేసుకోవడం మంచిదని భావించి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని ఆ నిందను తెలంగాణ ప్రభుత్వంపై వేసేందుకు పోసాని ఇలా తెరపైకి వచ్చి కేసీఆర్ కాళ్లుపట్టుకుంటామని ఏపీ పరువును బజారును పడేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ తీరు పట్ల అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.