ఏపీ నిరుద్యోగులకు వరుస శుభవార్తలు.. భారీ వేతనంతో ఆ ఉద్యోగాలను భర్తీ చేయనున్న జగన్ సర్కార్!

ఏపీ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతూ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సీఎం జగన్. ఇక ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ జాతర మొదలైంది. అందులో భాగంగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల అవ్వగా అందులో 81 పోస్టులను భర్తీచేయనుంది. 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులో భర్తీ కానున్నాయి. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్.. వాటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 331 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 566 గా ఉన్నాయి. అయితే జగన్ ప్రభుత్వంలో హాయంలో 6 లక్షల 16 వేల 323 పోస్టులను నియమించింది. ఇన్ని ఉద్యోగాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.

 

ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన బాబు సర్కార్ వారిని నమ్మక ద్రోహం చేసింది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిబందనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గతంలో ఏ ప్రభత్వం చేయని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన ఘనత జగనన్న ప్రభుత్వందే అని చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా పేద,మద్య తరగతి కుటుంబాలకు ఆర్ధిక పరిపుష్ఠి కలిగింది. చదువుకున్న ప్రతి విద్యార్ధి మంచి ఉద్యోగం జగనన్న థ్యేయం. విద్యావ్యవస్థ బాగుంటేనే సమాజం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది సీఎం జగన్ గారి నమ్మకం. అందుకే గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయలేనన్ని నిధులు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. స్కూల్ పిల్లలకు ఎన్నో రకాల వసతులను కల్పించారు.

అలాగే ప్రజారోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టులను భర్తీ చేసింది. ఆరు లక్షల ఉద్యోగాల్లో లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు. 3 లక్షల 99 వేల 791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది. 19 వేల 701 పోస్టులు కాంటాక్ట్ బెసెస్ లో నియామకాలు జరిగాయి. ఇవి కాక మరో 10 వేల 143 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. యూనివర్శిటీల్లో 3500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. టీడీపీ హాయాంలో వైద్య ఆరోగ్య శాఖలో 1693 పోస్టులు మాత్రమే భర్తీ చేయగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్ లు మొదలకుని టీచింగ్ ఆస్పత్రులు ఖాళీ పోస్ట్ అనేది లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 53 వేల 126 పోస్టుల్నీ భర్తీ చేసిన ఘనత జగన కే దక్కుతుంది. వీరిలో 3899 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు, 2088 మెడికల్ ఆఫీసర్లు , 13540 ఎఎన్ఎమ్ లు గ్రేడ్ 3 పోస్టులతో కలిపి 19527 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమాకాలు జరిగాయి. వీటితో పాటు 10032 మంది ఎంఎల్ హెచ్పీలు, 6734 స్టాఫ్ నర్స్ లు, 9751 మంది పారా మెడికల్ సిబ్బంది, 3303 క్లాస్-4 సిబ్బంది, 249 మంది డీఈవోలతో పాటు మెడికల్ కాలేజీల్లో నియమించిన 1582 ఉద్యోగులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 53,126 పోస్టులు ఉన్నాయి. ఇలా ఈ నాలుగన్నర ఏళ్ళ జగన్ పారదర్శక పాలనలో 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -