CM Jagan: మరో 30 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉండబోతున్నారా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా కూడా సీఎం అవుతారని ఎంతోమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎన్నికలు వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారు అనే విషయం మనకు తెలుస్తుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు.

 

వైఎస్ఆర్సిపి పార్టీ అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఎంతో ప్రేమ ఉన్నటువంటి ప్ర‌భుత్వ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం నేత కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి మ‌రో అడుగు ముందుకు వేశారు. ఈయ‌న త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతుంటారు. ఈయన ఏ విషయంలో కూడా రాజీ పడరు అయితే గతంలో కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి వెంకట్రామిరెడ్డి తాజాగా జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు.

 

ఉద్యోగుల కష్టాలను పక్కన పెట్టినటువంటి ఈయన జగన్మోహన్ రెడ్డి భజన చేయడంలో బిజీ అయ్యారని తెలుస్తుంది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మరో పాతిక సంవత్సరాలు ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఈయన తెలియజేశారు.జగన్మోహన్ రెడ్డి వృద్ధుడు అయ్యేవరకు కూడా ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడంటూ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

 

జగన్ కర్ర పట్టుకుని నడుస్తూ… నడం పొంగిపోయిన దశలో చిరాకు పుట్టి అసహ్యం వేసి ఆయన స్వయంగా రాజకీయాలనుంచి తప్పుకుంటే తప్ప ముఖ్యమంత్రి సీటు ఖాళీ అవదు అంటూ వెంకటరామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి భజన చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పట్ల చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -