Jagan: ఆ తప్పులకు శిక్ష అనుభవిస్తున్న జగన్.. ఏం జరిగిందంటే?

Jagan: ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలను చేపట్టి నాలుగున్నర రేళ్లు అవుతోంది. నాలుగురున్నరేళ్ల కింద రాష్ట్రం ఎలాఉంది. ఇప్పుడు ఎలా ఉంది. ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే నలభై ఏళ్లు వెనుకబడిపోయామనడంలో ఎటువంటి సందేశం లేదు. ఈ జగన్ పాలన మొదలైన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ప్రజలు ఎంత నష్టపోయారన్నది వారికి ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతోం ది. కానీ రాష్ట్రానికి జరిగిన నష్టం మాత్రం కళ్లముందే కనిపిస్తోంది. విధ్వంసం అయిన ప్రజల కలలు చిదిమేసిన స్వప్నాలు గుండెలు మండిపోయేలా చేస్తున్నాయి.

 

కానీ ఏపీని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే రెండు ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే కడుపుకు అన్నం తినబద్ది కాదు. అలాంటి పాలకుడి కింద బతుకుతున్నందుకు విరక్తి పుడుతుంది. పోలవరం జీవనాడి రివర్స్ పేరుతో నాశనం చేసేశారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల కలం. ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ప్రయత్నాలు చేస్తున్న ప్రాజెక్టు. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ను వదిలిస్తే.. నికరంగా వచ్చిన లబ్ది ఇదొక్కటే. చకచకా కట్టేసుకుని అదైనా రాష్ట్రానికి ఆస్తిలా చేసుకోవాల్సింది. ఐదేళ్లలో ఒక ప్రభుత్వం శక్తికి మించి పని చేసింది. కానీ జగన్ రెడ్డి వచ్చి ఏం చేయకపోగా ఉన్న దాన్ని రివర్స్ చేశారు. డబ్బే లక్ష్యంగా కాంట్రాక్టర్లు మార్చి వారు పనులు చేయలేక చేసిన పనులు దెబ్బతినే పరిస్థితికి తెచ్చారు.

ఇదిగో ఏడాదిలో కట్టేస్తాం, అదిగో కట్టేస్తామని చిటికెలు వేసిన పాలకులు ఇప్పుడు కట్టలేం ఏం చేసుకుంటో చేసుకోండి అనే స్థితికి వచ్చారు. ఇలా చేయడం వల్ల వారికేం పోయింది ? వారి కమిషన్లు వారికి వచ్చాయినష్టం ఎవరికి ? అమరావతిని చంపేసి ఏం సాధించారు ? అమరావతి రాష్ట్ర రాజధాని. అది అభివృద్ధి చెందితే ఓ కులం అభివృద్ధి కాదు. ఓ వర్గం అభివృద్ధి కాదు. అది రాష్ట్ర సంపద. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అభివృద్ధి చెందితే ఒక్క కులం అభివృద్ధి చెందిందా? అన్ని రాష్ట్రాలూ ఆ నగరాల ఆధారంగా ప్రజలకు మేలు చేస్తున్నాయి. కానీ మన కంట్లో మన వేలు పెట్టేపాలకుడిని నమ్మి ప్రజలు నిండా మోసపోయారు. పది లక్షల కోట్ల ఆస్తిని నాశనం చేశామని.. వైసీపీ పాలకులు వికటట్టాహాసంగా చెబుతున్నరాంటే ఏమనుకోవాలి. ఆ ఆస్తి ఎవరిది ? ప్రజలది నష్టం జరిగింది ప్రజలకే విశాఖ రాజధాని పేరుతో వైసీపీ నేతలు చేయాల్సిన దోపిడీ చేసుకుని బాగుపడ్డారు. నష్టపోయింది ప్రజలు, రాష్ట్రం ! తమకు పదివేలిచ్చారు ఏం నష్టం జరిగిందని కొంత మంది అనుకుంటూ ఉంటారు. వారి ఆలోచన స్థాయిల్ని అక్కడ ఉంచడం ద్వారానే ప్రభుత్వం, వైసీపీ ఇక్కడ చేస్తోంది. ఆ పది వేలకు ఇరవై వేలు వసూలు చేశారనే సంగతి ఆ వ్యక్తికి తెలియదు. కానీ ఎవరి మీదనో ద్వేషం నింపి.. వారిని నాశనం చేయడమే మీకు చేస్తున్న మేలు అనే సైకోతత్వాన్ని పెంచి.. పాలకులు పబ్పం గడుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాన్నిబద్దలు కొట్టే సమయం వచ్చింది. ఇలా రివర్స్ పాలనే జగన్ కు శాపంగా మారిందని చెప్పవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -