Raghu Rama: ఆగ‌స్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు.. రఘురామ కామెడీకి అంతు లేదా?

Raghu Rama: ఇటీవల కాలంలో వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. రోజంతా ఏవేవో పగటి కలలు కనడం వాటిని నిజం అనుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అన్నది ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయ‌న ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌ పై ప‌గ‌టి క‌ల క‌న్నారు. వెంట‌నే అదే విష‌యాన్ని లోకానికి చెప్పి, నెత్తిన భారాన్ని దించుకునేందుకు మీడియా ప్ర‌తినిధుల‌తో ముచ్చటించారు. ఆయన మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఆగ‌స్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు అవుతుంద‌నేది ఆ మాట‌ల సారాంశం.

ఏపీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉందని, ఇక మీదట ఏపీకి అప్పులు పుట్టే ప‌రిస్థితులు కూడా లేవ‌ని, అందుకే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నేది ర‌ఘురామ ఉద్దేశం. అప్పు లేనిదే ఒక్క‌రోజు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డ‌వ‌లేని ద‌య‌నీయ స్థితిలో ఉంద‌ని, తెలంగాణ ఎన్నిక‌ల‌తో పాటే ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. దొంగ ఓట్లు ఎక్కించ‌డానికి కూడా ముంద‌స్తు ఎన్నిక‌లే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు ఆయ‌న కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాల‌ని కోరగా రఘరామకృష్ణంరాజు వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ర‌ఘురామకి ఓటు ఉందో, లేదో చూసుకుంటే మంచిదది అంటూ నెటిజ‌న్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఏపీలో అడుగు పెట్ట‌డానికి భ‌య‌ప‌డే ర‌ఘురామ‌, రాజ‌కీయానికి మాత్రం ఆ రాష్ట్రాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్నారు. క‌నీసం ఎన్నిక‌ల్లో అయినా పోటీ చేయ‌డానికి ఏపీకి వ‌స్తారో, రారో మ‌రి. మాట‌లు కోట‌లు దాటిపోయేలా మాట్లాడుతున్న ర‌ఘురామ‌, ఏపీలో అడుగు పెట్ట‌డానికి గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ఈ మాత్రం దానికి అంత ఓవ‌ర్ యాక్ష‌న్ ఎందుకనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. .

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -