Jagan: జగన్ పరువు తీస్తున్న సొంత పార్టీ నేతలు.. అభాసుపాలయ్యారుగా!

Jagan: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా సొంత పార్టీ నేతలు సిద్ధం కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ కారణంగా జగన్ పరువు మొత్తం పోయింది.

 

కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరువు మొత్తం తీసేసింది. సిద్ధం పేరుతో ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలో కాకినాడ ప్రజలారా మిమ్మల్ని జగన్ నమ్మడు మీరు జగన్ ని నమ్మండి.. మీ ఓటు ద్వారా జగనన్నను దీవిస్తున్నారని ఆశిస్తున్నాము అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీలో జగనన్న జనాలను నమ్మారు అనే పదానికి బదులు నమ్మరు అంటూ తప్పుగా ఉండటంతో పలువురు ఈ పదాన్ని హైలైట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. స్వయంగా సొంత పార్టీ నేతలు జగనన్న పరువు తీస్తున్నారు అంటూ ఈ ఫ్లెక్సీ ని మరింత వైరల్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైనటువంటి నాయకులు ఆ పదాన్ని సరిచేసే ప్రయత్నం చేయగా కొందరు మరింత వైరల్ చేయడంతో చేసేదేమీ లేక ఈ ఫ్లెక్సీ తొలగించేశారు. ఇలా పద దోషాన్ని హైలైట్ చేస్తూ పలువురు ఈ ఫ్లెక్సీ ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -