Pawan Kalyan Fans: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు గత కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో తనం వారాహి యాత్ర ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన టువంటి పవన్ కళ్యాణ్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎండ తీవ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ ఎండకు పవన్ తట్టుకోలేక జ్వరం బారిన పడ్డారు. అందుకే కొద్దిరోజుల పాటు విరామం తీసుకుని తిరిగి మరోసారి వారాహి యాత్ర ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్ కు సినిమాలలో ఉన్నంత పట్టు రాజకీయాలలో లేదని చెప్పాలి సినిమాలలో ఏసీ గదులలో ఉంటూ నటించే పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కసారిగా ఎండలోకి వచ్చే ప్రచార కార్యక్రమాలు చేయాలి అంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే కాస్త చల్లబడిన తర్వాత ఈయన మీటింగ్లో నిర్వహిస్తూ ఉన్నప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
ఇలా పవన్ కళ్యాణ్ ఎండ తీవ్రతలకు తట్టుకోలేకనే తరచూ అనారోగ్యానికి గురవుతూ తన ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇలా ఈయన ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకోవడంతో అధికార పక్ష నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే మరి ఎన్నికలకు కొద్ది సమయమే ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలా తరచూ ప్రచార కార్యక్రమాలను వాయిదా వేస్తే మొదటికే మోసం వస్తుందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
రాజకీయాలలో కొనసాగుతూ పదవులు అనుభవించాలి అంటే అందుకోసం చాలా కష్టపడాలి. ఎండ వానలను సైతం లెక్క చేయకూడదు అందుకు మంచి ఉదాహరణగా చంద్రబాబు నాయుడుని చెప్పుకోవచ్చు 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈయన మండుటెండలో రోజుకు రెండు మూడు సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కూడా ఎండలను లెక్కచేయకుండా ప్రచార కార్యక్రమాలను మొదలు పెడితే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.