Lokesh: కొడాలి నానిని కట్ డ్రాయర్ మీద తిప్పుతా.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Lokesh: రాజకీయ నాయకులు మామూలుగా కోపంతో ప్రసంగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో బూతులు రావడం అన్నది సహజం. కొన్ని కొన్ని సార్లు ఆ బూతులు శృతిమించి కూడా వస్తూ ఉంటాయి. అలా తాజాగా గుడివాడ గడ్డపై నారా లోకేష్ అడుగు పెట్టాడో లేదో బూతులు తన్నుకు వచ్చేస్తున్నాయి. తాజాగా గుడివాడలో నారా లోకేష్ కొడాలి నాని గురించి మాట్లాడుతూ.. మన అమ్మ ను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడ దీసి, కట్ డ్రాయిర్ మీద గుడివాడ రోడ్ల మీద తిప్పే బాధ్యత తనది అంటూ గట్టిగానే ప్రతిజ్ఙ చేసారు.

లోకేష్ మాటలను బట్టి చూస్తే అధికారం లోకి వస్తే ప్రత్యర్ధులపై కక్ష సాధిస్తామని బాహాటంగా చెప్పారన్న మాట. ఇంతకు ముందే రెడ్ బుక్ ఒకటి పట్టుకుని, అధికారంలోకి వచ్చాక ఎవరెవరిని కక్ష సాధించాలా అన్నది పేర్లు రాసుకుంటున్నా అని ఓపెన్ గానే తెలిపారు. అంటే అధికారంలోకి వస్తే ప్రత్యర్ధుల మీద విరుచుకుపడతా అని బహిరంగంగానే తెలుపుతున్నాడు లోకేశ్..మరి దీన్నే ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అని, రాజారెడ్డి రాజ్యాంగం అని కూడా టీడీపీ అంటూ వుంటుంది. జగన్ తనకు గిట్టని వారి మీద కక్షసాధిస్తే ఫ్యాక్షనిస్ట్ అని, రాజారెడ్డి రాజ్యాంగం అని యాగీ చేస్తుంటుంది.

 

మరి లోకేష్ అందుకు భిన్నంగా కదా వుండాలి కదా. అలా కాకుండా రెడ్ డైరీ, గుడ్డ లిప్పదీయడం, కట్ డ్రాయిర్ మీద ఊరేగిస్తా అనడం, ఇంకా ముందుకు వెళ్లి ఉచ్చ పోయిస్తా అని సవాలు విసరడం ఇది మాత్రం ఎల్లో మీడియాకు సంబంరంగా, సమ్మగా వుంటుందేమో? మొత్తానికి గుడివాడలో తాజాగా లోకేష్ నాని గురించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. మరి లోకేష్ వాఖ్యలపై నాని ఏ విధంగా స్పందిస్తారా అని ఇప్పుడు ఏపీలో అటు అధికార నేతలు ఇటు ప్రతిపక్ష నేతలు ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -