Payal Rajput: పాయల్‌తో విష్ణు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తెలుగులో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక కన్నడ సినిమా కూడా ఒకటి లైన్‌లో ఉంది. తమిళంలోనూ చేస్తోన్నట్టుంది. అయితే మూడేళ్ల తరువాత తాను థియేటర్లోకి వస్తున్నాను అంటూ.. ఆడియెన్స్ తన మీద ప్రేమ కురిపించాలని, మద్దతు ఇవ్వాలని తీస్ మార్ ఖాన్ ఈవెంట్‌లో పాయల్ ఎమోషనల్ అయింది. ఆ సినిమాను ఎంతగా ప్రమోట్ చేయాలో అంతా చేసింది. కానీ చివరకు ఈ సినిమా బెడిసి కొట్టేసింది.

కనీసం పాయల్ ప్రజెన్స్, అందాల ఆరబోతకైనా మంచి టాక్ వచ్చిందా? అంటే అది లేదు. పాయల్ మొహంలో చాలా మార్పులు వచ్చాయన్న టాక్ వినిపించింది. మొత్తానికి పాయల్‌కు మాత్రం తీస్ మార్ ఖాన్ ఏ రకంగానూ ఉపయోగపడలేదు. ఆమె చేతిలో ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమా ఉంది. అదొక్కటే ఆమెను కాపాడాలి. అది హిట్ అయితే.. ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే.

పాయల్ మంచు విష్ణు కలిసి ఆఫ్ స్క్రీన్ రొమాన్స్‌తో సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తున్నారు. జిన్నా సెట్‌లో ఈ ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు. వీరికి తగ్గట్టుగా సన్నీ లియోన్ కూడా తోడైంది. ఈ ముగ్గురూ కలిసి చేసే రీల్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా పాయల్ రాజ్‌పుత్ చుట్టూ మంచు విష్ణు తిరుగుతూ ఉన్నాడు. ఈ ఇద్దరూ చేసే రీల్ వీడియోల హంగామా తగ్గడం లేదు.

ప్రస్తుతం పాయల్, మంచు విష్ణు ఇద్దరూ కూడా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలే ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ మీద వివాదాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -