Chiru Fans- Kodali Nani: కొడాలి నాని వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ నిరసన.. ఫ్యాన్స్ దెబ్బకు క్షమాపణలు చెబుతారా?

Chiru Fans- Kodali Nani: వైఎస్ఆర్సిపి పార్టీపై చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొడాలి నాని కూడా ఈ విషయంపై మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాల్లు ఉన్నారు. ప్రభుత్వం ఎలా పనిచేయాలి అనే విషయాలను కూడా ఈ పకోడీగాళ్లు మాకు చెబుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

ఈ విధంగా చిరంజీవిపై కొడాలి నాని చేసినటువంటి ఈ వ్యాఖ్యలను చిరంజీవి అభిమానులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే గుడివాడలో పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు ర్యాలీలు చేస్తూ రోడ్లపై నిరసన తెలిపారు.చిరంజీవి పట్ల కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు.

 

చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీ తీవ్రస్థాయిలో ఉద్రిక్తతను కలిగించింది. ఈ క్రమంలోనే పోలీసులు వీరిని అడ్డుకొని అరెస్టు చేశారు.ఇక వంగవీటి మోహనరంగం విగ్రహానికి పాలాభిషేకం చేయడమే కాకుండా కొడాలి నాని గత ఎన్నికలలో చిరంజీవి వంగవీటి రంగ అభిమానుల ఓట్లతోనే గెలిచారని అయితే ఆయనకు వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెబుతామని తెలిపారు.

 

ఈ విధంగా కొడాలి నాని చిరంజీవి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలపై గుడివాడలో బుధవారం తీవ్రస్థాయిలో ఉత్రికత నెలకొంది. అలాగే పలు ప్రాంతాలలో కూడా చిరంజీవి పై వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలపై మండిపడుతూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చిరంజీవి వైఎస్ఆర్సిపి పార్టీ నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ ఎప్పటికి ముగిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -