RK Roja: విందు రాజకీయాలు చేస్తున్న మినిష్టర్ రోజా.. ఎన్ని చేసినా ఈసారి ఓటమి తప్పదంటూ?

RK Roja: ఎన్నికలు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర రాజకీయాలలో వేడి రాజుకుంది. నువ్వా నేనా అంటూ పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ప్రతి ఒక్క పార్టీ నుంచి కొంత మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా త్వరలోనే మరి కొంతమంది పేర్లను ప్రకటించడానికి అన్ని పార్టీ నేతలు సిద్ధమయ్యారు.

ఇకపోతే ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సినీనటి రోజా వచ్చే ఎన్నికలలో తనకు నగరి నుంచి టికెట్ దక్కుతుందా లేదా అన్న విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక నగరి ఎమ్మెల్యేగా రోజాకు టికెట్ ఇస్తే తాము ఈ పార్టీకి మద్దతు తెలుపమని ఇప్పటికే అక్కడ రోజా పట్ల వ్యతిరేకత కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది.

ఈ విధంగా రోజా పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఈ ఎన్నికలలో ఈమెకు సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు కూడా అందరిలోనూ బలంగా ఉన్నాయి. ఇలా టికెట్ విషయం గురించి ఈమెకు ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోయినా రోజా మాత్రం పెద్ద ఎత్తున విందు రాజకీయాలను చేస్తూ అందరిని ఆకర్షించే పనిలో ఉన్నారు.

తాజాగా రోజా టీచర్స్ కి తాయిలాల ఎరవేశారు. తాము నిర్వహించే ఈ కార్యక్రమానికి రాకపోతే చర్యలు తప్పవు అంటూ డిఈఓ ఆఫీస్ నుంచి మెసేజ్ పంపించినటువంటి ఈమె టీచర్స్ కోసం మామిడి తోటలో ప్రత్యేకంగా విందు భోజనాలను ఏర్పాటు చేశారు. అలాగే సిరుగురాజుపాలెంలో ప్రతి పంచాయతీ నుంచి 150 మందిని వరకు ఆహ్వానించు వారికి విందు భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా బట్టలను కూడా తాయిలాలుగా ఇస్తూ ఓట్లు అడుగుతున్నారు అయితే ఈమె ఎన్నిసార్లు విందు భోజనాలు ఏర్పాటు చేసిన అక్కడ మాత్రం గెలిచే సూచనలు ఏమాత్రం లేవని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -