RK Roja: పార్టీ మారుతుందనే భయంతోనే రోజాకు సీఎం జగన్ టికెట్ ఇచ్చారా.. ఏం జరిగిందంటే?

RK Roja: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అభ్యర్థులను కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎన్నో రకాల సర్వేలను చేయించి ఎలా టికెట్లు అందజేశారు అయితే నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఆర్కే రోజా ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే రోజా పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రోజాకు టికెట్ ఇవ్వకూడదని కొంతమంది స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు అయినప్పటికీ జగన్ మాత్రం రోజాకు టికెట్ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో రోజాకు టికెట్ ఇవ్వడం వల్ల గెలుపు కష్టమేనని ఎన్నో సర్వేలు వెల్లడించినప్పటికీ జగన్ రిస్క్ చేశారు.

ఇలా రోజాకు టికెట్ ఇవ్వడం వెనక పెద్ద ఎత్తున హై డ్రామా నడిచిందని కూడా తెలుస్తోంది. జగన్ కనుక రోజాకు టికెట్ ఇవ్వకపోతే ఈమె పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో ఆమెకు టికెట్ ఇచ్చారట .. టికెట్ ఇవ్వడంతో ఈసారి కూడా తనదే గెలుపు ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుంది.

ఇలా తనపట్ల వ్యతిరేకత చూపుతున్న వారందరిని రోజా ప్రత్యేకంగా కలిసి వారికి భారీ స్థాయిలోనే ముడుపులు కూడా చెల్లించుకున్నారని ఈమె మాత్రమే కాకుండా తన భర్త సెల్వమణి తన సోదరులు కూడా లోకల్ నాయకులతో పెద్ద ఎత్తున అంతర్గత సమావేశాలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా రోజా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలిసే తనకు టికెట్ ఇచ్చారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -