Roja: బ్రాహ్మణిపై షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా.. దేవాన్ష్ కు రిమాండ్ రిపోర్ట్ చూపిస్తే అలా అంటాడంటూ?

Roja: చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కిన విషయం తెలిసిందే. బాబు అరెస్టుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీలు సంతోషంతో చంకలు గుద్దుకుంటుండగా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అలాగే ఏపీ లో అక్కడక్కడ టీడీపీ శ్రేణులు ర్యాలీలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా రాజమండ్రిలో నారా భునేశ్వరి, నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన తప్పా, మేము ఒంటరి వాళ్లం కాదు.

ప్రజలందరూ మా వెంట ఉన్నారంటూ ఆమె తెలిపారు. అయితే బ్రాహ్మణికి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం మీడియాతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణిని రంగంలోకి దించారని.. తీరా చూస్తే ఈ అస్త్రం తుస్సుమంది అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేవాన్స్ కు పొరపాటును కూడా సీఐడీ రిమాండ్ రిపోర్టును చూపించొద్దంటూ సెటైర్లు వేశారు. మా తాతా ఇంతటి అవినీతి పరుడా అని దేవాన్ష్ అనుకుంటాడని రోజా వ్యాఖ్యనించారు. బ్రాహ్మణి టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని.. ఆమెకు రాజకీయంగా ఏమీ తెలియదని నిన్ననే అర్ధమైంది అంటూ రోజా చురకలు అంటించారు.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు. పవన్ ను నమ్మి జనసేన జెండా మోసిన అభిమానులను ఆయన మోసం చేశారని దుయ్యబట్టారు. ఇక జగన్ స్థాయి ఎంతా అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఎంపీగా 5 లక్షలకు పైగా మోజార్టీ సాధించారని గుర్తు చేశారు. అది జగన్ స్థాయి అని, జగన్ ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓడిపోయాడని, అది పవన్ స్థాయని రోజా దుయ్యబట్టారు. మరి రోజా బ్రహ్మిని ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -