Sri Simha: మురళీ మోహన్ మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్న కీరవాణి కొడుకు.. వేల కోట్ల ఆస్తి అంటూ?

Sri Simha: యస్ .. ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్‌ లో రెండు పెద్ద కుటుంబాలు వియ్య మందుకుంటునన్నాయట. తెలుగు సినిమా రెండు పెద్ద కుటుంబాలు సంబంధం కలుపుకోబోతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు తెలుస్తున్న వార్తలు నిజమైతే రెండు మంచి పేరున్న కుటుంబాలు ఒక్కటి కాబోతున్నట్లే. తెలుగు సినిమా ప్రతిష్టను ఆస్కార్ లెవ‌ల్ తీసుకెళ్లిన కుటుంబం ఒకటి. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సినిమాలు, డీలర్ షిప్ ల ఇలా అన్ని విధాలా కాకలు తీరి, అందరితోనూ సన్నిహిత సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబం మరొకటి.

ఈ రెండు వియ్యం అందుకోబోతున్నాయి. ఆ కుటుంబలు మరేవో కాదు సంగీత దర్శకుడు కీరవాణి ఒకరు. నటుడు మురళీమోహన్ మరొకరు. మురళీ మోహన్ ఒక్కగానొక్క కొడుకుకు ఒకరే కుమార్తె. అంటే మురళీ మోహన్ మనుమరాలు. రూపా మాగంటి కుమార్తె. మురళీ మోహన్ మనుమరాలును కీరవాణి రెండో కుమారుడు, హీరో సింహాకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తను ఆ రెండు కుటుంబాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు జస్ట్ మాటలు మాత్రమే జరిగాయని, పెళ్లి వచ్చే ఏడాది వుంటుందని తెలుస్తోంది.

వేల కోట్ల ఆస్తికి వారసురాలు అయిన మురళీమోహన్ మనమరాలు చాలా అందంగా వుంటారని, ఆమెకు కీరవాణి కుమారుడు సింహా అంటే చాలా ఇష్టం అని ఆ వర్గాలు తెలిపాయి. సింహా కూడా చక్కగా వుంటాడు. వైవిధ్యమైన సినిమాలతో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -