ఏపీ విద్యా సంస్కరణలపై నెదర్లాండ్స్ లో ప్రశంసల వెల్లువ.. విదేశాల్లో ఏపీ పేరు మారుమ్రోగుతోందిగా!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో చేపడుతున్న విద్యాసంస్కరణలకు అంతర్జాతీయ వేదికపై ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా నెదర్లాండ్స్ లోని యుట్రెచ్ట్ జరుగుతున్న గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్ఫరెన్స్ 2023లో భారత ప్రతినిధిగా ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చలో ఈజిప్ట్, బుర్కినాఫాసో, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్ తో పాటు భారతదేశం తరఫున పాల్గొన్న సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఆవిష్కరణలు, సాధించిన ఫలితాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు.

విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. బదులిస్తూ ఏపీలో ఉన్న అద్భుతమైన ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యా శాఖాధికారులు, డీఎస్వోలతో పాటు భాగస్వామ్య సంస్థలైన అటౌన్ ఇంటర్నేషనల్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, రీప్ బెనిఫిట్ సహకారంతో సాధ్యమైనట్లు తెలిపారు. అనంతరం యునిసెఫ్, ది గ్లోబల్ ఫైనాన్షి యల్ లిట్రసీ ఎక్సలెన్స్ సెంటర్ చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఏపీలో విద్య విద్య వ్యవస్థలో మొదలైన సంస్కరణలు, అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదేం మొదటి సారి కాదు.

గత సెప్టెంబర్లో కూడా అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనా విధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాల పై ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాల మీద చర్చలను విద్యావేత్తలు, ఆర్థిక, సామజిక వేత్తలతో భేటీలు నిర్వహించారు.

పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో విద్యారంగంలో వచ్చిన మార్పులను దానికోసం సీఎం జగన్ చేపట్టిన సంస్కరణల గురించి కూడా వాళ్ళు వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి,నాడు నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందని పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా మన ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు. అలా ఏపీ విద్యా సంస్కరణలపై నెదర్లాండ్స్ లో ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాకుండా ఏపీ పేరు విదేశాల్లో పేర్లు మారుమోగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -