Allu Arjun-Krishnam Raju: అల్లు అర్జున్ పై నెటిజన్లు ఎందుకు కోపం అవుతున్నారో తెలుసా?

Allu Arjun-Krishnam Raju: టాలీవుడ్ ప్రేక్షకులకు అల్లు అర్జున్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయమైన బన్నీ.. ఆ తర్వాత పలు సినిమాలో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక ఇటీవల సుకుమార్ ప్రాణం పోసిన పుష్ప సినిమా ద్వారా బన్నీ పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్థాయిలో కొన్ని బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా చేస్తున్నాడు.

ఏదైనా అల్లు అర్జున్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీ వర్గాలు, రాజకీయ వర్గాలు ఏమాత్రం తీసుకోలేకపోయాయి. కృష్ణంరాజు చనిపోయిన విషయం తెలిసి తన అభిమానులు బాగా ఎమోషనల్ అవుతున్నారు.

ఇక కృష్ణంరాజు చనిపోయిన విషయం తెలియగానే చాలామంది సెలబ్రేటీలు సోషల్ మీడియా సహాయంతో కృష్ణంరాజు ఆత్మ శాంతించాలని తెలిపారు. ఈ విధంగా వాట్సాప్ లో ఫేస్బుక్ లో ప్రతి ఒక్కరూ కృష్ణంరాజు ఆత్మ శాంతి చేకూరాలని తెలిపారు. కానీ స్టార్ హీరో అల్లు అర్జున్ మాత్రం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఏమాత్రం స్పందించలేదు. కృష్ణంరాజు చనిపోయిన వార్త తెలిసి కూడా కొంతసేపటికి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక వీడియో పంచుకున్నాడు.

సైమా అవార్డు ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ తర్వాత కృష్ణరాజు మరణం గురించి ఏమైనా తెలుపుతాడా అనుకుంటే అప్పటికి కూడా బన్నీ ఏం తెలుపలేదు. ఈ విషయం గమనించిన కొందరు నెటిజన్లు బన్నీ పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయం గురించి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -