NTR: తారకరత్న భార్యకు మాటిచ్చిన ఎన్టీఆర్.. ఎమ్మెల్యే చేస్తానంటూ?

NTR:  నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మూగబోయింది. ఇప్పటికి ఆయన మరణాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన చనిపోయి దాదాపు నెల కావడానికి దగ్గరికి వస్తుంది. ఇక నందమూరి కుటుంబం మొత్తం ఆయన కుటుంబానికి తోడుగా, అండగా నిలబడ్డారు. ముఖ్యంగా బాలయ్య మాత్రం తారకరత్నను ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఇప్పటివరకు వారికి తోడుగానే ఉన్నాడు.

 

భవిష్యత్తులో కూడా వారికి తోడుగా ఉంటాను అంటూ అందరి ముందు మాట ఇచ్చాడు. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్త మరణ ఘటన నుండి బయటపడటం లేదు. ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. ప్రతిరోజు తన భర్త తారకరత్నకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ అవుతూ ఉంది. ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ కన్నీటితో మునిగిపోతుంది. ఇక తారకరత్నకు ముగ్గురు పిల్లలు ఉండగా.. ఆ పిల్లల బాధ్యతలను కూడా బాలయ్య దగ్గరుండి చేసుకుంటానని అన్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. అంతే కాకుండా గతంలో చంద్రబాబు ఆమెకు పార్టీ తరపున ఒక హోదా ఇస్తానని అన్నట్లు తెలిసింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమెకు ఎన్టీఆర్ ఒక మాట ఇచ్చాడని తెలుస్తుంది. అది కూడా అలేఖ్య రెడ్డిని కచ్చితంగా ఎమ్మెల్యే చేస్తాను అని మాట ఇచ్చాడని సమాచారం. ఆ మాటతో ఆమె ఎంతో సంతోష పడిందని తెలిసింది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ మంచితనానికి ఫిదా అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -