NTR: పిల్లల ఆస్తులు పంచేసిన తారక్… ఎవరికీ ఎంతంటే?

NTR: నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మూడో తరం నటుడు జూనియర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమాలో ‘కొమురం భీముడో’ పాటకు నటనతో సినీ ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్న యంగ్ టైగర్.. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు.

ఇక సినిమాల్లో బిజీగా ఉండే ఎన్టీఆర్.. వీలు కుదిరినప్పుడల్లా తన కుటుంబంతో గడిపడానికి ఇష్టపడతాడు. 2011లో లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తారక్.. ఇద్దరు మగ పిల్లలను కలిగి ఉన్నాడు. అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉండగా.. వారి గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఎన్టీఆర్ తన పిల్లలకు ఆస్తిని పంచినట్లు వస్తున్న వార్తలు అందరికీ షాక్ ఇస్తున్నాయి.

ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలైన అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ ల పేర్ల మీద తన ఆస్తిని రాసిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తారక్ తన పెద్ద కొడుకు పేరు మీద 40శాతం ఆస్తిని రాసిచ్చాడని, చిన్న కొడుకు పేరు మీద 60శాతం ఆస్తిని వాటాగా రాసిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కొడుకుల విషయంలో ఎన్టీఆర్ ఎందుకు ఇలా చేశాడనే చర్చ సాగుతోంది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టాడని.. ఆయనకు ఎవరికి ఎంత ఇవ్వాలనే విషయంలో క్లారిటీ ఉందని కొందరు తారక్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మొత్తానికి పిల్లలు ఇంకా చిన్నగా ఉండగానే ఎన్టీఆర్.. వారికి ఆస్తులు పంచి ఇవ్వడం ద్వారా జీవితంలో ఎంతో క్లారిటీ మెయింటెన్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -