P.V Sindhu: ఆ హీరోతో కలిసి నటించాలనుంది.. మనసులో కోరిక బయటపెట్టిన పీవీ సింధు!

P.V Sindhu: పీవీ సింధు.. భారతదేశంలోనీ ప్రజలతోపాటు ఇతర దేశాల ప్రజలకు కూడా ఈమె సుపరిచితమే. భారత స్టార్ షట్లర్ గా పీవీ సింధు గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఆమె తన ఆటతో భారతదేశానికి ఎన్నో మంచి మంచి పథకాలను తెచ్చి పెట్టింది. కాగా ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఎంతోమంది స్టార్ షట్లర్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఈమెకు మన భారతదేశంలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు బ్యాడ్మిటన్ కి పరిమితమైన పీవీ సింధు మొదటిసారిగా ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే పీవీ సింధుని ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ.

తాజాగా పీవీ సింధు కమెడియన్ హాలీ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది. కాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ కోసం నెటిజన్స్, పీవీ సింధు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన ఆ ప్రోమోలో ఆలీ తనదైన శైలిలో కామెడీ చేస్తూ పీవీ సింధు నీ ఇంటర్వ్యూ చేస్తూ ఆమెతో పాటు ప్రేక్షకులను కూడా బాగా నవ్వించారు. అయితే ఇదివరకే కొన్ని పీవీ సింధు కొన్ని సెలబ్రిటీలు పాల్గొన్న కార్యక్రమాలలో పాల్గొనడంతో సినీ ఇండస్ట్రీలో తనకున్న పరిచయాల కారణంగా ఆమెకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేశారు అలీ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో ఎవరు అని అడగగా చాలామంది హీరోలు నచ్చుతారు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది సింధు. ఎవరైనా ఒకరి పేరు చెప్పు అనడంతో ప్రభాస్ అని తెలిపింది. అంతేకాకుండా ప్రభాస్, తాను ఇద్దరు మంచి స్నేహితులట. ఇదే విషయాన్ని పీవీ సింధు తెలిపింది. అప్పుడు వెంటనే ఆలీ ఇద్దరూ ఒకే హైట్ అని మీకు ఇష్టమా అంటూ పంచులు వేస్తూ నవ్వులు పూజించారు ఆలీ. అనంతరం మీరు సినిమాల్లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. ఏమో నటిస్తానేమో అంటూ సమాధానం ఇచ్చింది సింధు. అయితే సింధు ఇచ్చిన సమాధానం బట్టి చూస్తే త్వరలోనే ఆమె ఇవ్వబోతోంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే ఆమె అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆమె బయోపిక్ లోనే ఆమెనే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -