Pallavi Prashanth: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈ షో చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పాటు ఐదో వారం ముగింపు దశకు చేరుకుంది. నేడు ఐదో వారం ఎలిమినేషన్స్ జరగనున్నాయి. కాగా 14 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్గా మొదలైన ఈ షోలో పదిమంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. నాలుగు వారాలు వరుసగా నలుగురు లేడీ కంటెంట్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చి మొదట్లో ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్న పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాడు. హౌస్ లో సీరియల్ ఆర్టిస్ట్ లు, మోడల్స్, సినిమా నటుల మధ్యన నిలదొక్కుకుని ఐదో వారంలో హౌస్ కి మొదటి కెప్టెన్ గా అవతరించడంతో పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాడు. హౌస్ లో రతిక, అమర్ దీప్ లు పల్లవి ప్రశాంత్ ని అనుకోకుండా బాగా హైలెట్ చేసారు. ప్రశాంత్ లో ప్రత్యేకత ఏమి లేకపోయినా ఎదుటివాళ్ళు అతన్ని ఎక్కువగా పట్టించుకుంటూ వాళ్లకు తెలియకుండానే హైప్ ఇస్తున్నారు.
ఇక శివాజీ తన భార్య లెటర్ త్యాగం చేసి పల్లవి ప్రశాంత్ కి కెప్టెన్సీ కంటెండర్ షిప్ ఇవ్వడంతో రంగు పడుద్ది టాస్క్ లో అందరూ సందీప్ మాస్టర్ ని అవుట్ చెయ్యాలనే తాపత్రయంలో పల్లవి ప్రశాంత్ ని వదిలేసారు. ఫైనల్ గా గౌతమ్-పల్లవి ప్రశాంత్ మధ్యలో టాస్క్ పడగా పల్లవి ప్రశాంత్ గెలిచి మొదటి కెప్టెన్ గా నిలిచాడు. అలాగే అమర్ దీప్ ఇంకా ఇంకా పల్లవి ప్రశాంత్ పై వెనుకగా వెటకారంగా మాట్లాడడం అతనికి ప్లస్ అయ్యింది. అలాగే అతనికి నెటిజెన్స్ నుంచి సపోర్ట్ పెరుగుతూ వచ్చింది. దానితో రైతు బిడ్డ ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇలాగే కనుక కొనసాగితే పల్లవి ప్రశాంత్ టాప్ ఫైవ్ లో ఉండడం ఖాయం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.