Pallavi Prashanth Parents: రతిక నా కొడుకును వాడుకుంది.. రైతు అని హేళన చేస్తున్నారు.. పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ సంచలన వ్యాఖ్యలు!

Pallavi Prashanth Parents:  బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో రైతు పల్లవి ప్రశాంత్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా తాను ఎప్పటినుంచో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలి అనుకుంటున్నానని ఒక్కసారైనా తనకు అవకాశం కల్పించాలి అంటూ ఈయన ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. దీంతో ఈసారి కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా పల్లవి ప్రశాంత అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.

ఇకపోతే తాజాగా పల్లవి ప్రశాంతత తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు గురించి పలు విషయాలు వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్లో రతీక తన కొడుకును తన అవసరాలకు అనుగుణంగా బాగా వాడుకుంటుందని తెలిపారు. అలాగే అమర్ దీప్ తన కొడుకును ఏందిరా అనడం తనకు చాలా బాధ కలిగించిందని ఈయన తెలియజేశారు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత నా కొడుకుని ప్రతి ఒక్కరూ రైతుబిడ్డ అంటూ హేళన చేస్తున్నారని అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరు సమానమేనని తెలిపారు.

నా కొడుకు ఓ ప్రేమ పాట చేసి ఏడు లక్షలు సంపాదించారు. అయితే ఏడు లక్షల కూడా తన స్నేహితులను నమ్మి మోసపోయారని ఇలా తన స్నేహితుల చేతిలో మోసపోవడంతో సూసైడ్ చేసుకుంటానని పొలంకి వెళ్లిపోయారని తన తండ్రి తెలియజేశారు అయితే ఆ సమయంలో తనకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని మాట ఇచ్చి నా కొడుకును కాపాడుకున్నానని ఆ తర్వాత తనకు ఫోన్ కొనివ్వడంతో రీల్స్ చేయడం మొదలు పెట్టారని తెలిపారు.

ఇక పల్లవి ప్రశాంత్ తల్లితండ్రులు తన కొడుకు బిగ్ బాస్ కార్యక్రమంలో ఉండడంతో చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. అయితే ఇలా తన కొడుకు గురించి కొన్ని విషయాలు తెలియజేసినటువంటి ఈయన తన కొడుకు పెళ్లి గురించి కూడా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా పెళ్లి చేసుకోమని చెప్పడంతో పెళ్లి మాట ఎత్తితే తాను ఇంట్లో కూడా ఉండనని వార్నింగ్ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తనకు పెళ్లి చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రశాంత్ తల్లిదండ్రులు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -