Pawan Kalyan-Renu Desai: పవన్ కళ్యాణ్ రేణు అలా జరగడం వల్లే విడిపోవాల్సి వచ్చిందా?

Pawan Kalyan-Renu Desai: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తెలుగులో నటించిన కొన్ని సినిమాలు అయినప్పటికీ ఏ హీరోకి లేని విధంగా భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ మరి హీరోకి లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన హీరోయిజం, మాట తీరు, మంచితనం ఇవన్నీ తనకు భారీగా అభిమానులు తెచ్చిపెట్టాయి. అంతా బాగానే ఉంది పెళ్లి విషయంలో మాత్రం పవన్ పూర్తిగా విఫలం అయ్యాడు. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే, రెండో పెళ్లి కూడా విడాకులతో ముగిసింది.

పవన్ రేణు దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ చూడ ముచ్చటైన జంట 2009లో పెళ్లి చేసుకుని 2012లో విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే విడాకులు అసలు ఎందుకు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ అంత చెడ్డోడా అనే కోణంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటికీ ఆ విషయంలో చాలా మంది అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ మంచితనమే వారి విడాకులకు కారణమయ్యిందని నెట్టింట ప్రచారం మొదలైంది. ముఖ్యంగా నాగబాబు వల్లే పవన్, రేణు దేశాయ్‌ పచ్చని కాపురంలో చిచ్చురేగిందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా నాగబాబు 2010లో ఆరంజ్ మూవీ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో తీసిన ఈ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా ఫెయిల్యూర్‌తో నాగబాబు ఒక్కసారిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆ ఆర్థిక ఇబ్బందులు తాగలేక చివరికి ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాడు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు అలాంటి పరిస్థితి రావడానికి చూసి అసలు తట్టుకోలేకపోయాడు. దాంతో తన ఫ్యామిలీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా తనకు సాధ్యమైనంత డబ్బులను నాగబాబుకి ఇచ్చి ఆదుకున్నాడు. ఈ సంగతి తెలిసి రేణు దేశాయ్‌ పవన్‌తో పెద్ద గొడవ పెట్టుకుందట. సంపాదించిన డబ్బంతా మీ అన్నయ్యకి ఇచ్చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆమె పవన్‌తో వాగ్వాదానికి దిగిందట. ఇక ఈ విషయంలో రోజు గొడవే జరుగుతుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఆమె నుంచి విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా వారి విడిపోయారని టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -