Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ని మోసం చేసింది వీళ్ళేనట.. ఎందుకో తెలుసా?

Payal Rajput: తెలుగు ప్రేక్షకులకు పాయల్ రాజ్ పుత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆ సినిమాలో తన హాట్ నెస్ తో బోల్డ్ గా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమాతోనే ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా వరకు పెరిగిపోయిందని చెప్పవచ్చు. మొత్తానికి డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ ను మరో స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

ఇక పాయల్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. మొదటి సినిమాకు అందిన ఆదరణ ఆ తర్వాత సినిమాలకు దక్కలేదు. అంతేకాక సినిమాలతో పూర్తిగా పాయల్ సినిమా ఆఫర్ల పరంగా అట్టకెక్కినట్లు అయింది. ఇక పాయల్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను నెట్టింట్లో పంచుకుంటూ.. సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి కొత్త అవడం వల్ల పాయల్ కొందరి చేతిలో మోసపోయిందట.

ఆమె తన మేనేజర్లను మొదటిలో నమ్మి మోసపోయిన విషయాని బయటపెట్టింది. అంతేకాకుండా పారితోషికం విషయం లో కూడా పాయల్ ని తన మేనేజర్లు చాలా మోసం చేశారని తెలిపింది. మొత్తం ముగ్గురు మేనేజర్లు పాయల్ని బాగా ఇబ్బంది పెట్టారట. అయితే ఇప్పుడు వాళ్ళని తీసేసాక పాయల్ సినిమా ఎంపిక పరంగా మంచిగా నడుస్తుందని తెలిపింది. నిజానికి పాయల్ కు ఆర్ఎక్స్ 100 సినిమా స్థాయిలో గుర్తింపు అందుకున్న సినిమా లేదు.

ఇక పాయల్ రాబోయే సినిమాల విషయానికొస్తే జిన్నా అనే సినిమాలో నటిస్తుంది. కాగా ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 12న థియేటర్లలో విడుదల కాబోతుంది. అదేవిధంగా కిరాతక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్. ఈ సినిమాకు డైరెక్టర్ వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -