Payal Rajput: వైరల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్!

Payal Rajput: ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా ద్వారా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే ఏ సినిమా కూడా తనకు పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఈమె అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా తన అందాల ఆరబోతతో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేసే ఈమె తాజాగా తన చేతికి సెలైన్ బాటిల్ పెట్టినటువంటి ఫోటోని షేర్ చేస్తూ తాను పెద్ద తప్పు చేశానని మీరు కూడా ఎవరు అలాంటి తప్పు చేయొద్దు అంటూ అభిమానులకు సలహాలు ఇచ్చారు. ఇలా ఈమె ఈ ఫోటోని షేర్ చేయడంతో ఒకసారిగా అభిమానులు ఆందోళన చెందారు.

 

ఇక ఈ ఫోటోని షేర్ చేసిన పాయల్ తనకు నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు లేదని తద్వారా డిహైడ్రేషన్ కి గురై కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే యాంటీబయాటిక్స్ తీసుకుంటూ చికిత్స తీసుకుంటున్నానని ఈమె వెల్లడించారు.ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగుందని తిరిగి బ్యాక్ బౌన్స్ అవడం కోసం తాను దారిలో ఉన్న అడ్డంకులు అన్నింటిని తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నానని తెలిపారు.

 

ఇక మీరు కూడా నాలాగా నీళ్లను తక్కువ తాగుతూ తప్పు చేయొద్దందని ఎప్పుడు హైడ్రేట్ గా ఉండమని ఈమె అభిమానులకు సలహా ఇచ్చారు.ఇక తనకు అనారోగ్యం బాగా లేకపోయినా షూటింగ్ ఆగిపోవడం లేదని అలాగే తాను షూటింగ్లో పాల్గొంటున్నానని ఈమె తెలిపారు. ఇలా పాయల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయడంతో ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -