Pooja Hegde: పూజా హెగ్డే బ్యాడ్ టైం.. తనను చూసి భయపడుతున్న నిర్మాతలు?

Pooja Hegde: టాలీవుడ్ ప్రేక్షకులకు పూజా హెగ్డే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. హిట్ టాక్ తన సొంతం చేసుకోలేకపోయింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఆడపా దడపా రెండు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు అంత గుర్తింపు పొందలేదు.

చివరికి పూజా ను ఐరన్ లెగ్ గా ఇండస్ట్రీలో ఒక పెద్ద పేరు పెట్టారు. ఆమెతో ఏ సినిమా తీసిన ఆ సినిమా పూర్తిగా ప్లాప్ అవుతుందని పుకార్లు రేపడం మొదలుపెట్టారు. అదే విధంగా పూజా కూడా కెరీర్ పరంగా కొంచెం కొంచెం గా డౌన్ అయిపోతుంది. ఈ క్రమంలో పూజని త్రివిక్రమ్ ఆదుకున్నాడని చెప్పవచ్చు. పూజా హెగ్డే లోని టాలెంట్ ని గుర్తించిన త్రివిక్రమ్ తనని అరవింద సమేత సినిమాలోకి తీసుకున్నాడు.

ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో పూజ ఒక్కసారిగా గుక్క తిప్పుకున్నట్లు అయింది. ఆ క్రమంలో పలు ఆఫర్స్ అందుకున్న పూజ ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ లోకి కన్వెర్ట్ చేసుకుంది. కానీ అంతలోనే ఈ అమ్మడు సినిమా సక్సెస్ విషయంలో పూర్తిగా ఢీలా పడిపోయింది. ప్రభాస్ తో తీసిన రాధే శ్యామ్ సినిమా పూర్తిగా గంగలో కలిపినట్లు అయ్యింది. ఇక బీస్ట్, ఆచార్య సినిమాలు సక్సెస్ పరంగా పూర్తిగా ఢీలా పడిపోయాయి.

దాంతో మళ్లీ పూజ హెగ్డే ఐరన్ లెగ్ అనే టాగ్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ పూజ పలు సినిమా ఆఫర్లను అందుకుంటుంది. కానీ పూజ బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. తనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు భయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక లైగర్ సినిమా ప్లాపును చూసి జనగణమన సినిమా నిర్మాతల పూర్తిగా భయపడిపోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా శుభ్రంగా ఆటకెక్కినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -